రెబల్ స్టార్ ప్రభాస్ హీరోయిన్ ,కృతి సనన్  ఫ్యాన్స్ కు ఫెస్టివల్ ట్రీట్ ఇచ్చింది మరీ పండగవేళ ట్రెడిషన్ వేర్ దర్శనమిచ్చి ఐఫీస్ట్ కలిగించింది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ నెట్టింట  బాగా వైరల్ అవుతున్నాయి.
తెలుగు ఆడియెన్స్ ను ఎప్పుడో పరిచయం చేసుకున్న కృతి సనన్.. తాజాగా మరోసారి అలరించబోతోంది ఈ ముద్దుగుమ్మ. గతంలో సుకుమార్ - సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన 'వన్ నేనొక్కడినే'లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన ఆడిపాడింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్' ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. కృతి సనన్ సీతా దేవి పాత్రను పోషిస్తోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.

ప్రభాస్ సరసన నటించి మరోసారి దక్షిణాది ఆడియెన్స్ కు మరింత దగ్గర కానుంది  ఈ బ్యూటీ. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను ఆకట్టుకుంటోంది. సినీ విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ మరింత దగ్గరవుతోంది ఈ నటి

తాజాగా దీపావళి సందర్భంగా కృతి సనన్ ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిచ్చింది. లేత గులాబీ  రంగు లెహంగా, వోణీలో మరింతగా మెరిసిపోతోంది ఈ ముద్దుగుమ్మ. సంప్రదాయ దుస్తుల్లో అదిరిపోయే పోజులిస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది.

పండగవేళ ట్రెడిషనల్ లుక్ లో  అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా అందాల విందుకూడా చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ చూపిస్తూ ప్రేక్షకుల మతి చెడగొట్టింది. చిరునవ్వులు చిందిస్తూ, కొంటే చూపులతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంది. ఫ్యాన్స్ కూడా ఈ బ్యూటీ అందాన్ని పొగుడుతూ ఫొటోలకు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు.

అయితే, ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంద్ పండిట్ దిపావళీ పార్టీలో కృతి సనన్ ఇలా మల్టీ కలర్డ్ లెహంగాలో హాలజరైంది. అందరీ చూపు తనపైనే పడేలా చేసింది అంటా ఈ బ్యూటీ ఇదిలా ఉంటే బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ కృతి సనన్  చాలా ఫుల్ బీజీగా ఉంటోంది మరీ. త్వరలోనే 'ఆదిపురుష్'తో ఆడియెన్స్ ను అలరించనుంది ఈ నటి

మరింత సమాచారం తెలుసుకోండి: