బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్‌ ఆదివారం నాడు ఆసుపత్రి పాలయ్యారు. అమితాబ్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు.
ఆ సమయంలో అమితాబ్ బచ్చన్‌ కాలు తెగిపోయింది, దీంతో అమితాబ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీకువచ్చిన వెంటనే అమితాబ్ బచ్చన్‌ కాలు నుండి రక్తాన్ని ఆపడానికి కుట్లు వేశారు. ఆదివారం నాడు కేబీసీ ఎపిసోడ్ షూటింగ్‌లో ఉండగా, ఆయనకు ప్రమాదం జరిగింది.

అమితాబ్ కాలి వెనుక భాగంలోని ఉన్న ఒక నరం తెగిపోయింది, ఈ క్రమంలో రక్తస్రావం ఎక్కువైంది. ఈ క్రమంలోనే ఆయన కాలికి కుట్లు వేయవలసి వచ్చింది. ప్రస్తుతానికి అమితాబ్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అమితాబ్ తన కాళ్లపై తాను కొన్నాళ్ల పాటు కూడా వద్దని పూర్తిగా బెడ్ కే పరిమితం అవ్వాలని వైద్యులు సూచించాలి. ఇక ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ తన అధికారిక బ్లాగ్‌లో కూడా పంచుకున్నారు.

ఒక మెటల్ ముక్క తన ఎడమ కాలిలో నరం తెంచిందని, అలా జరిగినప్పుడు రక్తం బయటకు ప్రవహిస్తూనే ఉందని పేర్కొన్నారు. వెంటనే హాస్పిటల్ కు తీసుకు వెళ్లడంతో డాక్టర్ అలాగే సిబ్బంది బృందం సకాలంలో సహకారం అందిం చడంతో తనకు శస్త్రచికిత్స జరి గిందని పేర్కొన్నారు. ఇక తన విల్ పవర్ చాలా బలంగా ఉంది, త్వరలోనే తిరిగి వస్తానని అమితాబ్ పేర్కొన్నారు.

అమితాబ్ బచ్చన్ తనను బయటికి వెళ్ల కూడదని వైద్యులు సూచించారని అన్నారు. అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో కేబీసీ సెట్స్‌లో గడిపే సమయంలో, చాలా ప్రత్యేక శ్రద్ధ తీసు కుంటానని అన్నారు. ఇక ఇటీవల అమితాబ్ బచ్చన్ ఇటీవల తన 80వ పుట్టిన రోజు వేడుకలు జరుపు కున్నారు. ఈ సందర్భంగా కేబీసీ బృందం ప్రత్యేక ఎపి సోడ్‌ను సూట్ చేసింది, ఆ ఎపిసోడ్లో అభిషేక్ బచ్చన్, జయా బచ్చన్ కూడా పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: