మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస రిమెక్ సినిమాలను చేస్తున్నారు..మొన్నామధ్య వచ్చిన గాడ్ఫాదర్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుంది..ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే మరో సినిమాను లైన్ లో పెట్టాడు.చిరంజీవి ప్రధాన పాత్రలో మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ‘వాల్తేర్ వీరయ్య’. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో మాస్ మహారాజా రవితేజ కనిపించబోతున్నారు. ఇద్దరు స్టార్స్ ని కలిసి తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా చిరంజీవి, రవితేజలపై మాస్ సాంగ్ షూటింగ్ పూర్తి చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు.


ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.. చిరంజీవి, రవితేజ గ్రేస్ ఫుల్ మూవ్స్, ఎనర్జీతో అలరించేలా మాస్ డ్యాన్స్ నంబర్ ను ట్యూన్ చేశారు. శేఖర్ మాస్టర్ అద్భుతంగా ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. చిరంజీవి, రవితేజ ఇద్దరూ అద్భుతమైన డ్యాన్సర్లు, భారీ సెట్ లో చిత్రీకరించిన మాస్ నంబర్ లో వీరిద్దరినీ చూడటం అభిమానులకు కన్నుల పండగ కానుంది. మెగా మాస్ విందును బిగ్ స్క్రీన్ లపై చూసేందుకు అభిమానులు, సినీ ప్రేమికులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు..


ఈ సినిమాలో చిరంజీవి లుక్ కాస్త కొత్తగా కనిపిస్తుంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత. నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చిరు చెల్లిగా కనిపించనుంది... షూటింగ్ పనులను వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: