ఉత్తర రామాయణ కథను నడిపిస్తూ, పూర్వ రామాయణాన్ని చెబుతూ మొత్తం రామకథను ఒక సినిమా గా అందించడం ‘లవకుశ’ చిత్రం ప్రత్యేకత.ఉత్తర రామాయణ కథను నడిపిస్తూ, పూర్వ రామాయణాన్ని చెబుతూ మొత్తం రామకథను ఒక సినిమా గా అందించడం ‘లవకుశ’ చిత్రం ప్రత్యేకత. తెలుగులో వచ్చిన తొలి రంగుల చిత్రం ఇది. అప్పటికి దేశంలో ఈస్ట్‌ మన్‌ కలర్‌ ఫిల్మ్‌ అందుబాటులోకి రాలేదు. గేవార్డ్‌ కంపెనీ సరఫరా చేేస కలర్‌ ఫిల్మ్‌ మీదే సినిమాలు తయారయ్యే వి. అందుకే వాటిని గే వా కలర్‌ సినిమాలు అనేవారు. తెలుగులో వర్ణ వైభవాన్ని తొలిసారిగా తనే చూపించాలని నిర్మాత అల్లారెడ్డి శంకర రెడ్డి మనసు పడ్డారు. 1956లో ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, అంజలీ దేవి, సావిత్రి కాంబినేషన్‌లో ‘చరణదాసి’ చిత్రం నిర్మించారు శంకర రెడ్డి. ఆ సినిమాలో ఓ సన్నివేశంలో ఎన్టీఆర్‌ శ్రీరాముడిగా, అంజలీదేవి సీతగా కనిపిస్తారు. ఎన్టీఆర్‌ శ్రీరాముడి గెటప్‌లో కనిపించిన తొలి సినిమా ఇదే. ఈ జంటకు మంచి ప్రశంసలు రావడంతో వీరిద్దరితోనే ‘లవకుశ’ సినిమా తీశారు శంకర రెడ్డి.
ఈ చిత్ర నిర్మాణానికి ఆయన పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఆర్థిక కారణాల వల్ల సినిమా షూటింగ్‌ మధ్యలోనే ఆగిపోయినా నిరాశ పడకుండా, వెనక్కి తగ్గకుండా ఐదేళ్లు అలుపెరుగని యోధుడిలా పోరాడారు. చివరికి అనుకున్నది సాధించారు. 1963 మార్చి 29న విడుదల అయిన ‘లవకుశ’ చిత్రానికి నుంచి అద్బుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. జనం బళ్ళు కట్టుకుని వచ్చి మరీ ఈ సినిమా చూశారు. బెజవాడ లోని మారుతీ టాకీస్‌లో ‘లవకుశ విడుదల అయింది. కృష్ణా జిల్లా అంతా తరలి వచ్చి మారుతీ టాకీస్‌లో ఈ సినిమా చూసింది.

హైదారాబాద్‌లో బసంతి, నటరాజ్‌ టాకీస్‌లో లవకుశ రిలీజ్‌ అయింది. ఆ రోజుల్లో సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌ ప్రాంతం ఓ తిరునాళ్ళలా ఉండేది. అప్పట్లో ఉదయం ఆటలు లేవు. రోజుకు మూడు ఆటలు మాత్రమే ప్రదర్శించేవారు. అందుకే మ్యాట్నికి టిక్కెట్లు దొరకక పోతే, క్లాక్‌ టవర్‌ పార్క్‌లో పడుకొని ఫస్ట్‌ షో చూసి వెళ్ళేవారు జనం. విడుదల అయిన అన్ని చోట్లా ఘన విజయం సాధించి, 62 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. 18 కేంద్రాల్లో 25 వారాలు ఆడింది. ఆ రోజుల్లో 60 వారాలు ఆడిన ఘనత లవకుశ కు దక్కుతుంది. కోటి రూపాయలు వసూలు చేసిన తొలి సినిమా ఇదే!

మరింత సమాచారం తెలుసుకోండి: