సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. సినిమా ఓకే అయిన తర్వాత..  హీరో, డైరెక్టర్ ఫిక్స్ అయిన తర్వాత.. ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ అనుకున్నాక ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం అనేది ఇండస్ట్రీలో మామూలే. ఇలా చాలా సినిమాలు తొలి దశలోనే ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. డైరెక్టర్ ని తప్పించడం, కాస్ట్ ని తప్పించడం లాంటివి జరుగుతుంటాయి. చాలా మంది దర్శకులకు, నటులకు బంగారం లాంటి అవకాశం చేజారిపోయిన సందర్భాలు ఉన్నాయి. దర్శకుడు మెహర్ రమేష్ లైఫ్ లో కూడా ఇలాంటి సంఘటనే జరిగిందట. ఒకటి కాదు ఏకంగా రెండు సినిమాలు తన చేజారిపోయాయని మెహర్ రమేష్ అన్నారు. ఓ యూట్యూబ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు.  పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జంటగా వచ్చిన టెంపర్ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ ని సరికొత్తగా ఆవిష్కరించిన సినిమా టెంపర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించారు. పూరీ జగన్నాథ్ టేకింగ్, డైలాగ్స్ ఎన్టీఆర్ ఇమేజ్ ని అమాంతం పెంచేసాయి. కథ పరంగా కూడా సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాంటి సినిమాని డైరెక్షన్ చేసే అవకాశం మొదట వచ్చింది మెహర్ రమేష్ కేనట. రవితేజ హీరోగా రెండు సినిమాలు చేయాల్సి ఉందని, కానీ ఆగిపోయాయని అన్నారు. అందులో ఒకటి టెంపర్ సినిమా అని మెహర్ రమేష్ అన్నారు.
వక్కంతం వంశీ కథ తాను రవితేజతో చేయాల్సిన సినిమా అని, ఆ కథ రవితేజకి చెప్తే మొదట ఓకే చేశారు గానీ తర్వాత స్క్రిప్ట్ నచ్చలేదని నిరాకరించినట్టు మెహర్ రమేష్ చెప్పుకొచ్చారు. షాడో తర్వాత ఆ సినిమా తీయాల్సింది, కానీ ఆగిపోయింది. జరగలేదని, పవర్ అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించానని అన్నారు. కానీ కథ రవితేజకి నచ్చక సినిమా పట్టాలెక్కలేదని వెల్లడించారు. ఆ తర్వాత ఆ కథని ఎన్టీఆర్ కి వినిపించారు వక్కంతం వంశీ. పూరీ టేకింగ్ అయితే బాగుంటుందని పూరీతో సెట్ చేశారు. అది కాస్తా టెంపర్ అయ్యింది. ఒకవేళ నిజంగా టెంపర్ సినిమా రవితేజ చేసి ఉంటే.. మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చి ఉంటే వేరేలా ఉండేదేమో. ఎన్టీఆర్, పూరీ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోవచ్చు కానీ రవితేజ, మెహర్ రమేష్ ల ఖాతాల్లో ఒక బ్లాక్ బస్టర్ పడేది. కానీ బ్యాడ్ లక్.. ఒక మంచి అవకాశం చేజారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: