టాలివుడ్ యంగ్ హీరో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి తర్వాత వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఆ సినిమాలు అన్నీ కూడా బాక్సాఫిస్ వద్ద పెద్దగా టాక్ తెచ్చుకోలేదు.. అయనా కూడా డార్లింగ్ కు వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఒకేసారి రెండు మూడు సినిమాల ను చేస్తున్నాడు.. ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్.. సలార్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దశ లో ఉంది. ఈ మూవిలో ప్రభాస్ నయా లుక్ లో కనిపించనున్నాడు. ఇక ఈ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.


ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ నటిస్తుండగా.. హోంబలే ఫిల్మ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కాగా, గత కొద్దిరోజుల్లో ప్రభాస్ పుట్టిన రోజు స్పెషల్ ఈ మూవీ నుంచి అప్డేట్ లేదా టీజర్ రాబోతుందంటూ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ నుంచి మరో ఆసక్తి కార వార్త ఫిలిం ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతున్నాయి. కేజీఎఫ్ ను రెండు పార్టులుగా తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్ ను కూడా రెండు భాగాలుగా తెరకెక్కించాలని ప్లాన్ ఉన్నారట. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.


అలాగే `కేజీఎఫ్` మల్టీవర్స్ లో భాగంగా ఈ మూవీ ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈ తో పాటే ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ఆదిపురుష్ అనే చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రాజెక్ట్ కే, ఇంకా మరో రెండు సినిమాలు చేస్తున్నాడు...


మరింత సమాచారం తెలుసుకోండి: