కోలీవుడ్ అగ్ర హీరో దళపతి విజయ్ ఈ సంక్రాంతికి 'వారసుడు' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మన టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటించింది. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమా రిలీజ్ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాల సైతం విడుదల కాబోతున్నాయి. దీంతో వారసుడు సినిమా ఈ రెండు సినిమాలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సినిమా నిర్మాత అయిన దిల్ రాజు బాలయ్య, చిరంజీవిల సినిమాలకు థియేటర్స్ దక్కకుండా అడ్డుకుంటున్నారు.

ముఖ్యంగా మెయిన్ సెంటర్స్ లో థియేటర్లన్నీ వారసుడు సినిమాకు వచ్చేలా చేస్తున్నాడు దిల్ రాజు. ఇక ఈ విషయం పట్ల ఇప్పటికే మెగా, నందమూరి ఫ్యాన్స్ దిల్ రాజు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మెగా ఫాన్స్ కి మరింత కోపం తెప్పించేలా ఓ వార్త ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇంతకీ అదేంటంటే.. తాజాగా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వారసుడు సినిమాని వీక్షించాడట. సినిమా చూసిన అనంతరం చిత్రాయునిట్ పై ప్రశంసలు సైతం కురిపించారట. తాజాగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న 'ఆర్ సి 15' అనే సినిమాకి సంబంధించి పనుల కోసం చెన్నైలోని తమన్ ఆఫీస్ కి రాంచరణ్ వెళ్లడం జరిగింది.

ఆ సమయంలోనే దిల్ రాజు రామ్ చరణ్ కి వారసుడు మూవీ ని ప్రీమియర్ వేసి మరి చూపించారట. సినిమా చూసిన చరణ్ మూవీ చాలా గొప్పగా ఉందంటూ తనదైన శైలిలో  సినిమాకి రివ్యూ ఇచ్చారట. అంతేకాకుండా సినిమా చూసిన అనంతరం మూవీ యూనిట్ పై పొగడ్తల వర్షం కురిపించారట. అయితే ఇప్పుడు ఈ విషయం మెగా ఫాన్స్ ను మరింత కోపానికి గురిచేస్తుంది. చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాకు థియేటర్స్ లేకుండా చేస్తున్న దిల్ రాజు నిర్మించిన వారసుడు సినిమాని రామ్ చరణ్ చూడ్డం బాగోలేదంటూ మెగా ఫాన్స్ చరణ్ పై కూడా ఫైర్ అవుతున్నారు. సినిమా చూడ్డమే కాకుండా మూవీ యూనిట్ పై ప్రశంసలు కురిపించడం ఫాన్స్ కి ఏమాత్రం నచ్చలేదు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: