నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో పంజా వైష్ణవ్ తేజ్ ఒకరు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన మూవీ తో హీరో గా వెండి తెరకు వైష్ణవ్ తేజ్ పరిచయం అయ్యాడు. కృతి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో వైష్ణవి తేజ్ కు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ యువ హీరో కొండ పొలం అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోయింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం పంజా వైష్ణవ్ తేజ్ "రంగ రంగా వైభవంగా" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. గిరీషయ్యా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో యంగ్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్ గా నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేకపోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయినా ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే బుల్లి తెర ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను దక్కించుకున్న జీ తెలుగు సంస్థ ఈ మూవీ ని మొట్ట మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం చేసినప్పుడు ఈ సినిమాకు 5.48 "టి ఆర్ పి"  రేటింగ్ దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: