టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో పోయిన సంవత్సరం కార్తికేయ 2 మూవీతో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ... శ్రీనివాస్ రెడ్డి ... వైవా హర్షమూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.

టాలెంటెడ్ డైరెక్టర్ చందు మండేటి ఈ మూవీbకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఇలా పోయిన సంవత్సరం కార్తికేయ 2 మూవీ తో అద్భుతమైన విజయం అందుకున్న నిఖిల్ పోయిన సంవత్సరం డిసెంబర్ 23 వ తేదీన 18 పేజెస్ అనే మరో మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

కార్తికేయ 2 మూవీ తర్వాత నిఖిల్ ... అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో రూపొందిన మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 10.30 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటివరకు ఈ సినిమా 17 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 17 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 11.13 షేర్ , 22.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో ఈ సినిమా ఇప్పటివరకు 0.13 కోట్ల లాభాలను అందుకొని బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని సక్సెస్ స్టేటస్ ను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: