టాలీవుడ్ ఇండస్ట్రీ లో మహేష్ బాబు మరియు పవర్ స్టార్ పవన్కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు.  తెలుగుసినిమా పరిశ్రమ ఎదుట ప్రిన్స్ మహేష్ బాబు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఇద్దరే. ఫ్యాన్స్ విషయంలో ఇద్దరు కూడా ఒక రేంజ్ లో అభిమానులని కైవసం చేసుకున్నారు. ఐతే వారి మూవీస్వస్తున్నాయి అంటే అపుడు ఫ్యాన్స్ కి పండగే పండగ. మూవీస్ రిలీజ్ ఇయ్యక వారి వారి పేర్ల మీదున్న పాత రికార్డులు బద్దలు కావాల్సిందే.
మరి ఇంతటి రేంజ్ లో స్టార్డం ఉన్న స్టార్  హీరోలు తమ కెరీర్ లో భారీ బడ్జెట్ మూవీస్ ఇప్పుడు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

ఐతే ప్రిన్స్ మహేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో తన కెరీర్ లో ఇరవై ఎనిమిది వ మూవీ  చేస్తుండగా ఆ మూవీ నియర్లీ రెండు వందల కోట్లతో తెరకెక్కుతుంది. ఇక పవన్ విషయానికి వస్తే డైరెక్టర్ క్రిష్ తో “హరిహర వీరమల్లు” అనే మూవీ ఆయన చేస్తుండగా ఇది కూడా నూట యాభై నుంచి నూట యేనభై కోట్ల మధ్యలో బడ్జెట్ తో తెరకెక్కుతూ పవన్ కెరీర్ లో కాస్ట్లీ సినిమా గా తెరకేక్కుతుంది.

ఇక పొతే ఈ రెండు మూవీస్ లు షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉండగా తాజాగా గా అయితే మహేష్ మువీ సెకండ్  షెడ్యూల్ ఈ జనవరి 18 నుండి ప్రారంభం కానున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అనేది ఇండస్ట్రీ వర్గాల నుండి బయటకు వచ్చింది. అయితే దీనికి ఒక రోజు ముందే పవన్ కళ్యాణ్ ఐతే హరిహర వీరమల్లు స్టార్ట్ చేస్తున్నట్లు ఊహగణాలు వినిపిస్తున్నాయి.ఆలా విరిద్దరి మధ్య ఒక రోజు గ్యాప్ తో స్టార్ట్ చేస్తున్నారు.

మరి ఈ షెడ్యూల్ అనేది  జనవరి 17 నుండి స్టార్ట్ కానుంది. ఈ విధంగా మహేష్ కన్నా ఒకరోజు ముందే పవన్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. ఐతే మరి మహేష్ పక్కన ఈ మూవీ లో  పూజా హెగ్డే చేస్తుంది.అలాగే పవన్ కళ్యాణ్ పక్కన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఐతే రాజకీయాలకు అతీతంగా వారిరువురి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని వారి అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: