తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టక ముందు వరకూ ఏ సినిమాలో నటించినా సరే ఆ సినిమా పక్కా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేది. కానీ ఇటీవల కాలంలో హిట్ అయితే చాలు అనేంతగా పరిస్థితి మారిపోయింది. ఇకపోతే ఖైదీ నెంబర్ 150 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న చిరంజీవి ఆ తర్వాత వచ్చిన సైరా నరసింహారెడ్డి తో పర్వాలేదు అనిపించికున్నాడు. ఇక ఆచార్యా సినిమా అయితే మెగాస్టార్ సినీ కెరియర్ లోని బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో కూడా పరవాలేదు అనిపించుకున్న చిరంజీవి తాజాగా సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య సినిమాను జనవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.


కానీ ఒక వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఇంకొక వర్గం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి.  నిజానికి ఈ సినిమాలో చిరంజీవి ఫుల్ లెంగ్త్  మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించాడు.  ఇలా మాస్ ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో నచ్చిన చిరంజీవి మిగతా ఆడియన్స్ కొంతవరకు మొదటి భాగంలో ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది . రెండవ భాగంలో రవితేజ ఎంట్రీ తర్వాత కథ మొత్తం మారిపోయింది.

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి మళ్ళీ ఎదురుచూపు చూస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.  మెగాస్టార్ ని ఉపయోగించుకోవడంలో డైరెక్టర్ బాబీ విఫలమయ్యాడు.  ఓవర్ ది టాప్ సెకండ్ హాఫ్ మరియు జీరో ఎమోషనల్ కనెక్ట్ తో పేలవమైన క్లైమాక్స్ .. భారీ స్టార్ తారాగణం ఉన్నప్పటికీ ఎవరికి గుర్తింపునివ్వలేదు. అని వార్తలు వినిపిస్తున్నాయి.  మరి సరికొత్త డైరెక్టర్ తో అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని చిరంజీవి ఎదురుచూస్తున్నట్లు సమాచారం. మరి ఈసారైనా ఆయన పలు జాగ్రత్తలు తీసుకొని తన తదుపరిచిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తారని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: