మెగా స్టార్ చిరంజీవి కోరుకున్న మాస్ హిట్ ‘వాల్తేర్ వీరయ్య’ ఇవ్వడంతో మంచి జోష్ లో ఉన్నాడు. 68 సంవత్సరాల చిరంజీవి వేసిన మాస్ స్టెప్స్ మాస్ యాక్షన్ కు క్లాస్ మాస్ ప్రేక్షకులు ఫిదా అవ్వడంతో ఈ సంవత్సరం సంక్రాంతి రేస్ విజేతగా చిరంజీవి మారాడు. ప్రస్తుతం కలక్షన్స్ లో దూసుకుపోతున్న ఈమూవీ హవా ఈ వారాంతం వరకు కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది.


ఈ పరిస్థితుల మధ్య ఈమధ్య జరిగిన ఈమూవీ సక్సస్ మీట్ లో చిరంజీవి తనకు మీడియా వర్గాల నుండి ఎదురైన ఒక ప్రశ్నకు షాకింగ్ సమాధానం ఇచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. 'వాల్తేర్ వీరయ్య’ మూవీలో చిరంజీవి రవితేజా ల కాంబినేషన్ కు మంచి ప్రశంసలు లభించడంతో అలాంటి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందా అంటూ మీడియా వర్గాలు అడిగిన ప్రశ్నకు చిరంజీవి తన హాస్య చతురతతో సమాధానం ఇచ్చాడు.


ఇండస్ట్రీలోని యంగ్ రైటర్స్ ఎవరైనా తమ ఇద్దరి కాంబినేషన్ ను ఊహించుకుని కామిడీ క్రైమ్ ఎలిమెంట్స్ ను కలుపుతూ ఒక వెరైటీ కథను వ్రాయగలిగితే తాను మళ్ళీ రవితేజా తో కలిసి నటించడానికి రెడీ అంటూ సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆమూవీ కథలో తామిద్దరం దొంగలుగా మారి ఇద్దరు ఘరానా దొంగలను పట్టుకునే కథగా ఉండాలని చిరంజీవి ఆకథకు సంబంధించి తన మనుసులో ఉన్న ఆలోచనలను బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇదే సక్సస్ మీట్ లో చిరంజీవితో కలిసి పాల్గొన్న రవితేజా మరొక అడుగు ముందుకు వేసి హాలీవుడ్ మూవీ ‘రష్ హవర్’ స్పూర్తితో ఎవరైనా ఒక కథ వ్రాస్తే తమ ఇద్దరి కాంబినేషన్ కు బాగుంటుంది అంటూ మాస్ మహారాజా మరొక ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది..


వాస్తవానికి ‘వాల్తేర్ వీరయ్య’ మూవీలో రవితేజా నటించింది కేవలం 40 నిముషాలే అయినప్పటికీ ఆ 40 నిముషాలలో చిరంజీవి రవితేజా ల మధ్య పేలిన డైలాగ్స్ తూటాలుగా మారడంతో ఈమూవీ మాస్ ప్రేక్షకులకు విందు భోజనంగా మారింది అన్న విశ్లేషణలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: