కన్నడ హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చి  స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకుంది రష్మిక మందన. అయితే గత కొన్ని రోజులుగా రష్మిక మందన పై రకరకాల రూమర్స్ ట్రోల్స్ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తో లవ్..  రక్షిత్ శెట్టి..రిషబ్  రిసమీద తన గొడవ ఇలా అన్నిటికీ క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఇందులో భాగంగానే రష్మిక ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పబోతోంది అని కూడా తెలుస్తోంది. ఇక ఈ వార్త విన్న రష్మిక మందన అభిమానులు త్వరలోనే రష్మిక లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుందేమో అని భావిస్తున్నారు. 

అంతేకాదు ఒకవేళ రష్మిక మందన లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే ఎలాంటి డైరెక్టర్ తో చేస్తుంది.. ఆ సినిమా నిర్మాత ఎవరు అన్న అంశంపై కూడా చర్చించుకుంటున్నారు ఆమె అభిమానులు. ఇందులో భాగంగానే రష్మిక మందన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... బాలీవుడ్లో తన సినిమాలు గురించి చెప్తూ.. గుడ్ బై సినిమా ఇప్పుడు ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు కానీ ..కొన్ని నీళ్లు తర్వాత అలాంటి సినిమా ఖచ్చితంగా వస్తే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను అంటూ చెప్పకు వచ్చింది. అంతేకాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమాలో తన పాత్ర గురించి కూడా చెప్పుకొచ్చింది రష్మిక.

ఇందులో భాగంగానే డైరెక్టర్ సందీప్ వంగా ఈ అనిమల్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని.. రణబీర్ కపూర్ రష్మిక మందన ఇద్దరం కలిసి మీ అందరికీ ఒక పెద్ద షాక్ ఇస్తాము అంటూ చెప్పకు వచ్చింది రష్మిక మందన.అంతేకాదు ఇతర విషయాలకు సంబంధించి కూడా చాలా విషయాలను తన అభిమానులతో రష్మిక మందన పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ ఇంటర్వ్యూ కి సంబంధించిన ఒక ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా రష్మిక మందనకి మొదటి ఛాన్స్ ఇచ్చినా రక్షిత్ మరియు రిషబ్ ల గురించి కూడా చాలా కాలం తర్వాత వారి గురించి రష్మిక మందన మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రష్మిక మందికి సంబంధించిన ఈ ప్రోమో కాస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: