బాహుబలి లాంటి వరల్డ్ వైడ్ హిట్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్కరి అంచనాలను చేరుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అటు నిర్మాతలకు కూడా భారీగా లాభాలను  తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో సినీ ప్రపంచం మొత్తం మరోసారి రాజమౌళి ప్రతిభ ముందు ఫిదా అయ్యింది అని చెప్పాలి.


 అయితే కేవలం భారతీయ చలనచిత్ర పరిశ్రమంలోనే కాదు విడుదలైన అన్ని చోట్ల కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. ఈ క్రమంలోనే ఈ సినిమాని ఒక్కో దేశంలో విడుదల చేస్తూ అటు నిర్మాతలు కూడా ముందుకు సాగుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే త్రిబుల్ ఆర్ సినిమాను జపాన్లో కూడా విడుదల చేశారు. అక్టోబర్ 21వ తేదీన జపాన్ లో విడుదల చేయగా.. అక్కడ కూడా వసూళ్లలో సత్తా చాటింది అని చెప్పాలి. జపాన్ లో అత్యధిక వస్తువులు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది త్రిబుల్ ఆర్ సినిమా.


 అంతేకాకుండా రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ముత్తు లైఫ్ టైం కలెక్షన్స్ ని కూడా క్రాస్ చేసింది అని చెప్పాలి. అయితే ఈ సినిమా రాబోయే రోజుల్లో ఒక్క బిలియన్ జపనీస్ యెన్ లను వసూలు చేస్తుంది అని అంచనా వేస్తున్నారు శసినీ ని విశ్లేషకులు. ఈ సినిమా వసూళ్లలో దూసుకుపోతూ ఉండడంతో ఇద్దరు హీరోల అభిమానులు కూడా సంతోషంలో మునిగిపోతున్నారు. మా అభిమాన హీరోలకు ఎక్కడికి వెళ్లినా తిరుగు ఉండదు అంటూ కామెంట్లు కూడా చేస్తూ ఉండడం గమనార్హం. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా బట్ నటించగా.. అటు ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటించింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: