కుప్పంలో పాదయాత్రకు బయలుదేరిన తారకరత్న ఉన్నట్టుండి గుండెపోటుతో కిందకు పడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. తారకరత్న ఒక్కసారిగా కిందకి పడిపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ హుటాహుటిన ఆయనను హాస్పిటల్కి తరలించారు. అనంతరం తారకరత్నను పరిశీలించిన వైద్యులు చెప్పిన విషయాన్ని విన్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం భారతరత్న పరిస్థితి చాలా విషమంగా ఉందని హార్ట్ ఎటాక్ వచ్చిందని చెప్పడంతో నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.  హాస్పిటల్ లో చేరి ఇప్పటికే రెండు వారాలు గడుస్తుంది. అయినప్పటికీ తారకరత్న ఇంకా స్పృహలోకి రాలేదు. 

అయితే భారతరత్న హాస్పిటల్ లో చేరినప్పటి నుండి తారకరత్న భార్య తన దగ్గరే ఉండి అన్ని చూసుకుంటూ ఉంది.తన భార్యతో పాటు తారకరత్న కోసం బాబాయ్ బాలకృష్ణ కూడా తారకరత్న దగ్గరే ఉంటూ తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటున్నాడు. బాలకృష్ణ తన సినిమాలను సైతం పక్కన పెట్టి కొడుకు మళ్లీ మామూలు మనిషి కావాలని ఇండియాలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ తో బాలకృష్ణ తారకరత్నకు వైద్యాన్ని అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇక తారకరత్న హాస్పిటల్ లో ఉండగా అతని భార్య చేసిన ఒక పని గురించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్నాయి. ఇక తారకరత్న అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఇక లేఖ రెడ్డికి తారతరత్న కంటే ముందే ఒక పెళ్లి విడాకులు కూడా తీసుకుంది. అయినప్పటికీ ఈ విషయం తెలిసిన తారకరత్న తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన అనంతరం వీళ్ళిద్దరూ మీరు కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. ఎంతో సంతోషంగా సాగుతున్న వీరిద్దరి జీవితంలో అనుకోకుండా తారకరత్న గుండెపోటుకు గురవడంతో వారి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తారకరత్న హాస్పిటల్ లో ఉన్నప్పటినుండి తన భార్య తన పక్కనే ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని చూసుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తారకరత్నకు జరుగుతున్న ట్రీట్మెంట్ గురించి తెలుసుకొని మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తుంది. అంతే కాదు తారకరత్న మళ్లీ మామూలు మనిషి కావడానికి ఎన్ని లక్షలు కోట్లయిన సరే ఖర్చు చేస్తామని కానీ తారకరత్నకి మంచి వైద్యాన్ని అందించమని వైద్యులను బ్రతిమిలాడుతున్నట్లుగా తెలుస్తోంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: