టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టడమే కాకుండా, ఆస్కార్ వంటి ప్రెస్టీజియస్ అవార్డును కూడా దక్కించుకుని అందరితో కూడా శభాష్ రాజమౌళి అని అనిపించాడు. ఇక ఇప్పుడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్ ఫోకస్ ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై పెట్టేందుకు పూర్తిగా రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తన నెక్ట్స్ సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేయబోతున్నట్లు ఎస్ ఎస్ రాజమౌళి అనౌన్స్ చేశాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు కూడా ఓ రేంజ్‌లో క్రియేట్ అవుతున్నాయి.అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ లోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావడంతో, ఇకపై రాజమౌళి చేసే సినిమాలన్నీ కూడా ఖచ్చితంగా గ్లోబల్ స్థాయిలో గుర్తింపును తెచ్చుకోవడం ఖాయం. దీంతో, రాజమౌళి డైరెక్షన్‌లో రాబోయే సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీపై అంచనాలు అమాంతం ఒక్కసారిగా పెరిగిపోయాయి. అసలే మహేష్ బాబు చూడటానికి హాలీవుడ్ యాక్షన్ హీరోల ఉంటాడు. పైగా టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకడు.


ఇక అందువల్ల ఈ సినిమాను జక్కన్న ఎలాంటి కథతో తెరకెక్కిస్తాడా.. ఈ సినిమాలో మహేష్ ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. అయితే, ఈ సినిమాను ఆఫ్రికాలోని అడవి నేపథ్యంలో గ్లోబ్ ట్రాటింగ్ ఫిల్మ్ గా తెరకెక్కించబోతున్నట్లు ఎస్ ఎస్ రాజమౌళి గతంలోనే వెల్లడించాడు.ఇక ఈ సినిమాను యూనివర్సల్ కథతో తెరకెక్కించేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడట. గ్లోబల్ స్థాయిలో ఇంకా ఎక్కువ అవార్డ్స్ వచ్చేలాగా ఇంకోసారి ఇంకా ఎక్కువ ఆస్కార్స్ కొట్టేలాగా ఈ సినిమాలో అనేక మైండ్ బ్లోయింగ్ అంశాలను యాడ్ చేయనున్నాడట. ఇంకా ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ లుక్స్ పరంగా కూడా హాలీవుడ్ హీరోలతో పోటీపడటం ఖాయమని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి మహేష్ బాబు సినిమాను గ్లోబల్ ఆడియెన్స్ మెచ్చే విధంగా తీర్చిదిద్దేందుకు రాజమౌళి ఎలాంటి కథను రెడీ చేస్తాడా.. ఈ సినిమాను ఆర్ఆర్ఆర్‌ సినిమాను మించే మూవీగా ఆయన ఎలా తెరకెక్కిస్తాడా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: