పాన్ ఇండియన్ స్టార్ రామ్ చరణ్ మరికొన్ని రోజుల్లో పుట్టినరోజు వేడుకల ను జరుపుకోనున్నారటా.. నాటు నాటు సాంగ్ కు అవార్డ్ రావడం తో చరణ్ పేరు కూడా మారుమ్రోగుతోంది

టాలీవుడ్ ఇండస్ట్రీలో ని బెస్ట్ డ్యాన్సర్లలో రామ్ చరణ్ ఒకరనే విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ చేసిన ఒక పని ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక ఫోటోలో నంది అవార్డులను  నేలపై పెట్టి ఆస్కార్ అవార్డులను టేబుల్ పై పెట్టి చరణ్ ఫోటోలను షేర్ చేశారని తెలుస్తుంది.

ఫోటో లో చరణ్ స్టైల్ గా టేబుల్ పై కూర్చొని ఉన్నారటా.టేబుల్ పైన ఆస్కార్ అవార్డ్ తో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఉండగా ఫిల్మ్ ఫేర్ అలాగే నంది అవార్డులు మాత్రం నేలపై చరణ్ కాళ్లకు దగ్గరగా ఉన్నాయటా.. నంది అవార్డుల విషయం లో చరణ్ చిన్నచూపుతో వ్యవహరించారని కొంతమంది సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. చరణ్ ఈ కామెంట్లపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరీ.

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమా తో బాగా బిజీ అవుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ సినిమా షూట్ పూర్తి కానుందని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కానున్నాయని  తెలుస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానున్నా అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. రామ్ చరణ్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే విషయం తెలిసిందే.

రామ్ చరణ్ భిన్నమైన కథల ను ఎంచుకోవడంతో పాటు పాన్ వరల్డ్ లెవెల్ లో తన సినిమాలు కచ్చితంగా విజయం సాధించేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి అయితే ఉంది. చరణ్ కు మాస్ ప్రేక్షకుల్లో అంచనాలను మించి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. చరణ్ సినిమాల కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: