రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ లో శృతి హాసన్ ... ప్రభాస్ కి జోడిగా నటిస్తూ ఉండగా ... జగపతి బాబు ... పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మూవీ కి రవి బుస్రుర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే మొదట ఈ మూవీ ని ఈ  చిత్ర బృందం పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కాక పోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ఇంగ్లీషు లో కూడా విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం సన్నహాలు చేస్తున్నట్లు ... త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే చాలా భాగం పూర్తయినట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ మూవీ షూటింగ్ సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ఇంకా కేవలం 15 నుండి 20 రోజులు మాత్రమే పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరో 15 నుండి 20 రోజుల్లో ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు ... ఆ తర్వాత ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఈ మూవీ యూనిట్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: