సాధారణంగా హీరోయిన్లు పెళ్లి అయ్యాకా పెద్దగా సినిమాలు చెయ్యరు అనేది ఇండస్ట్రీలో టాక్. ఇక పెళ్ళైన హీరోయిన్ తల్లి అయ్యింది అంటే చాలు హీరోల పక్కన రొమాన్స్ చేయాల్సినవారినే అక్కాచెల్లెళ్లను చేసేస్తున్నారు.అయితే హీరోయిన్స్ మాత్రం రీ ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశంతో ముందు వెనక ఆలోచించకుండా ఏదైనా ఓకే అంటున్నారు. అందాల ఆరబోతకు తాము సిద్ధమంటున్నారు. అయితే ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ మనవరాలు ఇంకా స్టార్ హీరో కూతురు పైగా మరో స్టార్ హీరోకు భార్య ఇప్పుడు ఒక సినిమాలో ఐటెం సాంగ్ చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా పెద్ద హాట్ టాపిక్ గా మారింది.ఇంతకీ ఆమె ఎవరో కాదు సాయేషా సైగల్. అలనాటి నటి నజీరా భాను ముద్దుల మనవరాలు ఈమె. పైగా కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఆర్య భార్య.. అఖిల్ సినిమాతో తెలుగుతెరకు చాలా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది సాయేషా. మొదటి సినిమాతో యూత్ ను మొత్తం తన వైపు తిప్పుకుంది.


అయితే ఆ సినిమా విజయం అందుకోకపోవడంతో టాలీవుడ్ కు టాటా బై బై చెప్పేసి.. ఇక తమిళ్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఇక తమిళ్ లో తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే స్టార్ హీరో ఆర్య ప్రేమలో పడి, పెద్దలను ఒప్పించి అతన్ని పెళ్లాడింది.పైగా ఈ జంటకు అరియనా అనే ఒక పాప కూడా ఉంది. ఇప్పటి దాకా అమ్మ పాత్రలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తున్న సాయేషా.. రీ ఎంట్రీకి మాత్రం హీరోయిన్ గానో, సపోర్టివ్ క్యారెక్టర్ గానో కాకుండా ఏకంగా ఐటెం గర్ల్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్ స్టార్ హారో శింబు, గౌతమ్ కార్తీక్ నటిస్తున్న మల్టీస్టారర్ పాతు తలా సినిమాలో ఈ హాట్ బ్యూటీ ఐటెం గర్ల్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ పాటలో అందాలు ఆరబోస్తూ సూపర్ గా డాన్స్ చేసింది. కొంతమంది  అభిమానులు ఈమెను మెచ్చుకుంటుంటే కొంతమంది మాత్రం సాయేషాను ఏకిపారేస్తున్నారు. స్టార్ హీరో భార్యవి పైగా ఒక బిడ్డ తల్లివి అయ్యి ఉండి ఇలా ఐటెం సాంగ్ చెయ్యడం ఏమాత్రం బాగోలేదు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: