ఇండియన్ సినిమా ప్రొడక్షన్ కి ఆస్కార్ తెచ్చిన దర్శకుడిగా రాజమౌళి ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ కి తన ఇమేజ్ ని పెంచుకున్నాడు రాజమౌళి.ఇక ఈ నేపధ్యంలో ఎస్ ఎస్ రాజమౌళి తరువాత చేయబోయే సినిమాల విషయంలో ప్రేక్షకుల్లో చాలా భారీ అంచనాలు ఉన్నాయన్న సంగతి అందరికి తెలిసిందే. తరువాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కెఎల్ నారాయణతో  పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కించబోతున్నారనే సంగతి అందరికి తెలిసిందే.ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ అడ్వంచర్ థ్రిల్లర్ గా తీయబోతున్నాడు రాజమౌళి. ఇక హాలీవుడ్ స్టార్స్ ని ఈ మూవీ కోసం రాజమౌళి రంగంలోకి దించుతున్నాడు. ఈ ఏడాది సెకండ్ ఆఫ్ లో ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యి వచ్చే సంవత్సరం మార్చి తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రాజమౌళి తాజాగా మరో పెద్ద నిర్మాతతో సినిమా చేయడానికి కమిట్ అయినట్లు సమాచారం తెలుస్తుంది.అయితే ఈ సారి తెలుగులో కాకుండా కన్నడ ఇండస్ట్రీలో పెద్ద నిర్మాణ సంస్థలో మూవీ చేయడానికి ఒకే చెప్పాడు రాజమౌళి. హోంబలే ఫిలిమ్స్ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న పెద్ద నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్.


ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి గత సంవత్సరం సుదీప్ విక్రాంత్ రోనా సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఇక ధృవ్ సర్జాతో కేడీ అనే మరో పాన్ ఇండియా మూవీ కూడా ఈ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తుంది. ఇంకా ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తూ ఉండగా హాట్ బ్యూటీ శిల్పాశెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. వీటికంటే ముందుగా కుమారస్వామి తనయుడు అయిన నిఖిల్ గౌడతో రైడర్ అనే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో  తెరకెక్కింది. మరో రెండు చిన్న సినిమాలు కూడా చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా కన్నడ  రైట్స్ ని ఈ నిర్మాణ సంస్థ దక్కించుకొని విడుదల చేసింది.అప్పుడే రాజమౌళితో సదరు నిర్మాతలకి పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయంతోనే వారితో సినిమా చేయడానికి రాజమౌళి ఒప్పందం చేసుకున్నాడు అని సమాచారం తెలుస్తుంది. ఇక ఈ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కంప్లీట్ అయ్యాక ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: