హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం.యశోద వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాతో వచ్చిన సమంత.ఈ సారీ ఒక విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. దీంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మలయాళం నటుడు దేవ్ మోహన్ కూడా ఇందులో దృశ్యంతుడి పాత్రలో నటించారు.


ఇందులో కీలకమైన పాత్రలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ ,మధుబాల, గౌతమి వంటి వారు కూడా నటించారు. అయితే ఈ సినిమా ఎన్నోసార్లు విడుదల సమయంలో వాయిదా పడుతూనే వస్తోంది ..కానీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదల కావడం జరిగింది అయితే ఇప్పటికే ఆడియన్స్సినిమా అని చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.


శాకుంతలం సినిమా కథ శకుంతల జననంతోనే మొదలవుతుంది.. విశ్వామిత్రుని తపస్సు భంగం కలిగించేందుకు మేనకను ప్రయోగించిన ఇంద్రుడు వీరిద్దరు ప్రేమలో పడేలా చేస్తారట.. వారి ప్రేమకు గుర్తుగా శకుంతల జన్మిస్తుందని.. అలా పక్షుల సంరక్షణలో పెరుగుతున్న ఈమె కన్వ మహర్షి చూసి ఆమెను దత్త పుత్రికగా స్వీకరిస్తారట. శకుంతలాగా పెరిగిన సమంత మొదటి చూపులోని దుష్యంతుడు ప్రేమలో పడతారు. ఆ తర్వాత వీరిద్దరూ ఒక్కటి కావడంతో పాటు ఈమెను రాజ్యానికి తీసుకువెళ్తానని దృశ్యంతుడు చెప్పి.. ఎంతకి తిరిగి రాడు చివరికి కన్వ మహర్షి శకుంతలను దృశ్యంతుని వద్దకు పంపితే దృశ్యంతుడు ఎవరు శకుంతల తెలియదు అంటూ నిండు సభలు అవమానిస్తారు.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన శకుంతలకు భరతుడు జన్మిస్తాడు.. ఆ తర్వాత దుష్యంతులు, శకుంతల ఎలా కలిశారు అనే విషయం కథ అన్నట్లుగా తెలుస్తోంది.


సినిమా కథ కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాపం తల మని పుస్తకం నుంచి తెరకెక్కించారు. వాస్తవానికి గుణశేఖర అంటే సెట్టింగ్ గ్రాఫిక్స్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోని పురాణాలను బట్టి ఈ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లుగా పెద్దగా కనిపించలేదు. సినిమాకి డైలాగులు మార్చి రాసుకున్నారు తప్ప అవిజ్ఞాన శాకుంతలాన్ని మార్చిన దాఖలు లేవు. పురాణ కథ కావడంతో నేటిజన్లకు కాస్త కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. త్రీడీ ఎఫెక్ట్ మాత్రం ఈ సినిమాకు అదనపు హక్కు హంగులు జోడించాయి.


అద్భుతమైన విజువల్స్ త్రీడీలో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. మొదటి భాగం అంత శకుంతల జననం శకుంతలాత దృశ్యంతుడి ప్రేమలో పడడం వంటివి అంశాలను చూపించారు. రెండవ భాగంలో దృశ్యంతుడు ,శకుంతలాకి పెరిగిన దూరం వారిద్దరు ఎలా కలుస్తారు అనే విషయంపై చూపించారు. ఇందులో యుద్ధం సన్నివేశాలు బాగానే ఆకట్టుకున్నాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ అనే విషయం చూసిన వెంటనే ప్రేక్షకులకు అర్థమవుతుంది. టెక్నికల్ అంశాల పైన డైరెక్టర్ గుణశేఖర్ తన మార్కులు చూపించలేకపోయారు. కానీ కథను పట్టి ఎంతవరకు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందో చూడాలి. మణిశర్మ పాటలు సాయి మాధవ్ బుర్ర సంభాషణలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్ ప్రధాన బలం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: