సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ చిత్రాలు తెరకెక్కడం సర్వసాధారణం ఎంతో మంది సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన టువంటి ప్రముఖ నాయకుల జీవిత కథ ఆధారంగా ఇప్పటికే ఎన్నో బయోపిక్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఇలా బయోపిక్ చిత్రాలకు ఇండస్ట్రీ  లో ఎంతో మంచి క్రేజ్ ఉందనే చెప్పాలి. ఈ క్రమంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా యాత్ర అనే బయోపిక్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ బయోపిక్ చిత్రం ద్వారా దర్శకుడుగా మహి వీ రాఘవ్ ఎంతో మంచి గుర్తింపు పొందారు.

వైయస్ రాజకీయ జీవితం గురించి ఈ సినిమా లో ఎంతో అద్భుతంగా చూపించడంతో అప్పట్లో ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం రావాలని ఎంతో మంది అభిమానులు కోరుకుంటున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి డైరెక్టర్ మహి యాత్ర సినిమా సీక్వెల్ గురించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారని చెప్పాలి. ప్రస్తుతం ఈయన సేవ్ ది టైగర్ వెబ్ సిరీస్ను రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ నేటి (ఏప్రిల్ 27) నుంచిడిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారపు కానుంది. దీంతో ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ ఇంటర్వ్యూల లో భాగం గా మహి యాత్ర సీక్వెల్ గురించి మాట్లాడారు. తప్పనిసరిగా యాత్ర సీక్వెల్ చిత్రం ఉంటుందని ఈయన వెల్లడించారు. అయితే ఈ సీక్వెల్ రావడానికి మరి కాస్త సమయం పడుతుందని తెలిపారు.అయితే ఈ సీక్వెల్ చిత్రం లో మహి ఈసారి ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సినిమా చేయబోతున్నారని సమాచారం. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: