తెలుగు బుల్లితెర పైనే కాదు సౌత్ లోనే బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో గా కొనసాగుతుంది ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షో. దాదాపు గత 15  ఏళ్ళ నుంచి కూడా ఎంతో విజయవంతమైన షోగా టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ అదరగొడుతుంది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జాని మాస్టర్ లాంటి  టాలెంట్ ఉన్నవాళ్లకి మంచి లైఫ్ ఇచ్చింది ఢీ షో. ఇప్పటికీ ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ ఢీ షోలో తమ టాలెంట్ నిరూపించుకొని ఇండస్ట్రీలో ఛాన్సులు కొట్టేస్తున్నారు.



 అయితే ఒకప్పుడు ఢీ షో అంటే కేవలం డాన్సులు మాత్రమే ఉండేవి అని అందరూ అనుకునేవారు. కానీ ఇటీవల కాలంలో ఢీ షో అంటే డాన్సులతో పాటు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ కూడా అందుతూ ఉంది. దీంతో ప్రతి బుధవారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని మిస్ అవ్వకుండా వీక్షించడానికి బుల్లితెర ప్రేక్షకులందరూ కూడా ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఎన్నో సీజన్ల నుంచి అటు శేఖర్ మాస్టర్ ఢీ షోలో జడ్జిగా కొనసాగుతూ వస్తున్నాడు. అయితే జడ్జ్ శేఖర్ మాస్టర్ ని అప్పుడప్పుడు టీం లీడర్ హైపర్ ఆది రసికుడు అని పిలవడం  చేస్తూ పంచులు వేస్తూ ఉంటాడు.


 ఇటీవల శేఖర్ మాస్టర్ చేసిన పని చూసిన తర్వాత నిజంగానే శేఖర్ మాస్టర్ రసికుడే అని ప్రతి ఒక్కరు అంటారు. ఇటీవల ఢీ షో కి సంబంధించి ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన కమాన్ కమాన్ కళావతి అనే ఒక పాటపై శ్రద్ధ దాస్ తో కలిసి శేఖర్ మాస్టర్ డాన్స్ చేస్తాడు. అయితే దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా శ్రద్ధ దాస్ తో ఎంతో రొమాంటిక్ డాన్స్ చేస్తాడు శేఖర్ మాస్టర్. దీంతో అక్కడున్న టీం లీడర్స్ అందరూ కూడా షాక్ అయ్యారు. ఇది చూసిన ప్రేక్షకుల సైతం దొరికింది సందు అనుకొని శేఖర్ మాస్టర్ రెచ్చిపోయాడుగా అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: