టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ హీరో లలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఈ యువ హీరో ఇప్పటికే ఎన్నో సినిమా లలో హీరో గా నటించి ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే సాయి తేజ్ తాజాగా "విరూపాక్ష" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా ... సంయుక్త మీనన్మూవీ లో హీరోయిన్ గా నటించింది. 

మంచి అంచనాల నడుమ ఈ మూవీ ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. సస్పెన్స్ ... ద్రిల్లింగ్ ... హర్రర్ కాన్సెప్ట్ తో రూపొందున ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ పాజిటివ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు నుండే అదిరిపోయే కలెక్షన్ లు వస్తున్నాయి. అలాగే ఈ మూవీ కి వీక్ డేస్ రోజు కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి.

 ఇప్పటి వరకు ఈ సినిమా 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 7 రోజుల్లో ఈ సినిమా సాధించిన కలెక్షన్ ల సంబంధించిన వివరాలు తాజాగా అధికారికంగా ప్రకటించింది. 7 రోజుల్లో ఈ మూవీ 62.5 కోట్ల కలెక్షన్ లను సాధించినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లాంగ్ రన్ లో మరింత సాలిడ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: