టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మరియు లక్ష్మి ప్రణతి ఇద్దరికీ 2011 మే 5న పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మి ప్రణతి ఇద్దరు కూడా దూరపు చుట్టాలు. చంద్రబాబు నాయుడు కారణంగా వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత నుండి ఇప్పటివరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ మరియు లక్ష్మీ ప్రణతి ఎంతో అన్యోన్యంగా  గొడవలు లేకుండా చాలా చక్కగా ఉంటారు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని లక్ష్మీ ప్రణతిని చాలా బాగా చూసుకుంటుందని అంటారు. జూనియర్ ఎన్టీఆర్ భార్యగా నందమూరి కోడలుగా కూడా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది లక్ష్మీ ప్రణతి. 

ఎంత పెద్ద సెలబ్రిటీ భార్య అయినప్పటికీ కూడా ఇలాంటి వివాదాల్లోకి తల దూర్చదు లక్ష్మీ ప్రణతి. ఇప్పటివరకు ఎలాంటి వివాదాల కు తావ ఇవ్వలేదు. అయితే వీరిద్దరికీ ఇద్దరు బాబులు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.ఎప్పటికీ తన ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ లక్ష్మీ ప్రణతి ఇంటిపట్టునే ఉంటుంది .మొదటి కొడుకు అభిరామ్ పుట్టినప్పుడు ఎన్టీఆర్ లక్ష్మీ వ్రత ఇద్దరూ చాలా సంతోషించారట. నందమూరి కుటుంబంలో వారసుడు పుట్టాడు అని కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషించారట. కానీ రెండవ కొడుకు భార్గవ్ రామ్ పుట్టినప్పుడు మాత్రం ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి ఇద్దరు కూడా చాలా బాధపడినట్లుగా తెలుస్తోంది .

దీనికి కారణం లక్ష్మీ ప్రణతి భార్గవరామ్ పుట్టకముందే తన కి ఆడపిల్లలు పుట్టాలని కోరుకుందుట. కానీ రెండోసారి కూడా అబ్బాయి పుట్టడంతో వారిద్దరు కూడా చాలా బాధపడినట్లుగా తెలుస్తుంది. వారిద్దరికీ అమ్మాయి అంటే చాలా ఇష్టమట సాధారణంగా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ ఆనందమే వేరే అని భావించిన వీరిద్దరూ ఆడపిల్ల పుట్టాలని కోరుకున్నారట .కానీ ఆడపిల్ల పుట్టకపోవడంతో వీరిద్దరూ ఎంతో బాధపడినట్లుగా చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నాడు. ఇక అలా లక్ష్మీ ప్రణతి ఆడపిల్ల విషయంలో ఉన్న కోరిక తీర్చలేక పోయినందుకు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికి బాధపడుతూనే ఉన్నట్లుగా సమాచారం వినబడుతుంది. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: