తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న అనుష్క మరియు నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ నెల 26 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. కాకపోతే ఈ మూవీ ని ఈ నెల 26 వ తేదీన ఈ చిత్ర బృందం విడుదల చేసే అవకాశాలు లేనట్లే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని జూన్ నెలలో కానీ ... ఒక వేళ జూన్ నెలలో ఈ మూవీ ని విడుదల చేయనట్లు అయితే జులై మొదట వారంలో కానీ ఈ మూవీ ని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి ఇప్పటికే చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు ఒక టీజర్ ను కూడా విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. నిశ్శబ్దం మూవీ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని అనుష్క నటించిన మూవీ కావడం ... ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ... జాతి రత్నాలు లాంటి పరస విజయ వంతమైన మూవీ ల తర్వాత నవీన్ పోలిశెట్టి నటించిన సినిమా కావడంతో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాపై సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: