సౌత్ సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉంటూ కేవలం నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ ఎంతో క్రేజ్ సంపాదించుకుంది ఈ మలయాళ ముద్దుగుమ్మ. ఇక టాలీవుడ్ లో 'ఫిదా' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది సాయి పల్లవి. ఆ తర్వాత టాలీవుడ్లో అగ్ర హీరోల సరసన నటిస్తూ మంచి విజయాలు అందుకుంది. ఇక ఈ మధ్యకాలంలో సాయి పల్లవి సినిమాలు ఎక్కువగా చేయడం లేదు. ఇటీవలే ఓ సినిమాకి ఈమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

 అయితే తాజాగా సాయి పల్లవి పెళ్ళికి సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేంటంటే.. సాయి పల్లవి ఇటీవల ఓ బడా బిజినెస్ మాన్ తో పెళ్లిని రిజెక్ట్ చేసిందంట. తాజాగా తాను ఓకే చేసిన సినిమా షూటింగ్ పూర్తయి, రిలీజ్ అయ్యాక తను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్లకు చెప్పిందట. ఇప్పటివరకు తన పెళ్లి గురించి ఎవరు మాట్లాడకూడదని గట్టి కండిషన్ కూడా పెట్టిందట. ఇప్పటికే ఇంట్లో వాళ్ళు సాయి పల్లవిని పెళ్లి చేసుకోమని బాగా ఒత్తిడి చేస్తున్నారట. కానీ సాయి పల్లవి మాత్రం పెళ్లికి ఇప్పుడే ఒప్పుకోవడం లేదని చెబుతున్నారు. రీసెంట్ గా ఒక సంబంధం వస్తే ఆమె రిజెక్ట్ చేసిందట.

ఓ బడా బిజినెస్ మ్యాన్ సంబంధం వస్తే సాయి పల్లవి దాన్ని చాలా సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సాయి పల్లవి చివరగా విరాట పర్వం, గార్గి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాయి. దీంతో కొంత గ్యాప్ తీసుకుని ప్రస్తుతం కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేస్తోంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: