ఈ మధ్యకాలంలో వచ్చిన చిత్రాలు హిట్ ఫట్టు అనే సంబంధం లేకుండా నిర్మాతల జేబులు నింపుతున్నాయి. థియేటర్లలో ఒక రేంజ్ లో టికెట్లు అమ్ముడుపోయాయి అంటే ఈ సినిమా బిజినెస్ కూడా అంతే రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు. తాజాగా నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను మూట కట్టుకుంది. అయినప్పటికీ రూ .22 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


కోలీవుడ్ లో స్టార్  డైరెక్టర్ గా పేరుపొందిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య చేసిన బైలింవల్ మూవీ కస్టడీ.. ఈ సినిమాలో హీరోయిన్గా కృతి శెట్టి నటించగా విలన్ గా అరవిందస్వామి నటించారు. ఇందులో కీలకమైన పాత్రలు ప్రియమణి కూడా నటించింది. ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా దిమ్మతిరిగే రేంజ్ లో జరిగినట్లు తెలుస్తోంది.. దాదాపుగా రూ.21.80 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ రూ.22.50 కోట్లకు క్లోజ్ గా ఉండడంతో ఈసారి చైతన్య ప్రొడ్యూసర్ జేబులో నియమింపడం ఖాయమని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.


దీనికి తోడు తాజాగా విడుదలైన ఈ సినిమా డిసెంట్ టాకుతోనే రన్ అవుతుంది ఇక భారీగానే ఓపెనింగ్స్ వచ్చేలా ఉండడంతో ఈ లెక్కన చూస్తే ఈ సినిమాతో ప్రొడ్యూసర్స్ ఖుషి అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. థాంక్యూ సినిమా గోరమైన డిజాస్టర్ తర్వాత నాగచైతన్య నటించిన కస్టడీ సినిమాతో ఏ మేరకు కలెక్షన్లు రాబడతారో చూడాలి మరి. నాగచైతన్య ఈమధ్య కాలంలో చాలా స్టైలిష్ గా కనిపిస్తూనే మాస్ హీరోగా పేరు తెచ్చుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం నాగచైతన్య తన తదుపరి చిత్రంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: