పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సలార్ సినిమా రాబోతున్న సంగతి ఇద్దరికీ తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రాబోతుంది. ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ కి కూడా కేవలం నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఆది పురుష్ సినిమా రిలీజ్ అయిన రోజు సలార్ సినిమాకి సంబంధించిన టీజర్ ని సైతం విడుదల చేయబోతున్నారని సమాచారం వినబడుతుంది. ఒకేరోజు ప్రభాస్ నటిస్తున్న రెండు సినిమాలకి సంబంధించిన అప్డేట్ విడుదలవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒకేరోజు రెండు పండుగలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఈ వార్త విన్న ప్రభాస్ అభిమానులు దీని కంటే మించిన శుభవార్త ఉంటుందా అంటూ తమ సంతోషాన్ని వ్యక్త పరుస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమా కేజీఎఫ్ తరహా యాక్షన్ సన్నివేశాలతో పాటు నెక్స్ట్ లెవెల్ స్క్రీన్ ప్లే తో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాతో ప్రభాస్ తన కెరియర్ పరంగా ఎదగడంతోపాటు ఈ సినిమా తర్వాత మరిన్ని విజయాలను అందుకో బోతున్నాడని తమ అభిమానులు అంటున్నారు.

ప్రభాస్ ఈ సినిమాకి 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నడట. అంతేకాదు ఈ సినిమా వర్కింగ్ డేస్ కూడా ఎక్కువ.ఏంతో కష్టపడి ఈ సినిమాని తీసారట .ఆ కష్టానికి 10 రెట్ల ఫలితం వస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నాడు ప్రభాస్ .బాహుబలి సినిమా తో రికార్డ్ బ్రేక్ చేసి తన సత్తాను చాటుకున్న ప్రభాస్ ఈ సినిమాతో కూడా అంతటి విజయాన్ని అందుకుంటాడని కోరుకుంటున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ గా ఎదగడంతో పాటు తన అభిమానులకు మరింత దగ్గరవుతారని కోరుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు. దీంతో ప్రభాస్  కెరియర్ పరంగా మరిన్ని విజయలు దక్కాలని వేడుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: