ఇటీవల కాలంలో వాహన వినియోగం ఎక్కువ అవుతోంది . ఇక అందుకు తగ్గట్టుగానే ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఒకరు అత్యవసర పరిస్థితుల్లో కొనుగోలు చేస్తే, మరి ఒకరు తమ హుందాతనం చూపించుకోవడం కోసం రకరకాల ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇక అందుకు తగ్గట్టుగానే ద్విచక్ర వాహన తయారీ సంస్థలు కూడా కస్టమర్లకు నచ్చేలా, వారి అభిరుచికి తగ్గట్టుగా భిన్న విభిన్న టెక్నాలజీతో ప్రజల ముందుకు తీసుకువస్తున్నాయి. ఇక అందుకు తగ్గట్టుగానే వాటి ధరలు కూడా పెరిగిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఇంధన ధరలు కూడా పెరగడంతో వీటి ధరలు కూడా పెరిగాయి అని చెప్పవచ్చు.. అయితే ఇప్పుడు ఏకంగా ఒక ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఒక మోడల్ బైక్ పై  ఏకంగా 28,201 రూపాయిలనున్ తగ్గించాలని అనుకుంటోందట.. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీలలో ఒకటైన రివోల్ట్ మోటార్స్ సంస్థ ఒక మంచి ఆఫర్ ను,తమ వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లకు ఒక శుభవార్తను తెలిపింది. అదేమిటంటే ఎలక్ట్రిక్ బైక్ రివోల్ట్ ఆర్ వి 400 బైక్ పై ఏకంగా ఎవరు ఊహించని విధంగా రూ.28,201 ను తగ్గించి బైక్ ప్రియులను మెస్మరైజ్ చేస్తోంది. ప్రముఖ బైక్ లలో బాగా పాపులారిటీ పొందిన బైక్ లలో, ఒకటైన ఈ బైక్ ధర ఇంత తగ్గడం వల్ల వాహనదారులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది.
సాధారణంగా మార్కెట్లో ఈ బైకు ధర రూ.1,19,000 ఉండగా , ఇక ఈ బైక్ పై రూ 28,201 ను తగ్గించి రూ.90,799 కే విక్రయించడం గమనార్హం. ఇక దీని వల్ల కస్టమర్లకు ఏకంగా 28 వేల రూపాయల లాభం చేకూరనుంది. ఈ బైక్ లో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. అందులో 3KW మోటార్ తో పాటు 72 v ,3.24 KWH లిథియం అయాన్ బ్యాటరీ కూడా ఉంది. ఇది గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. ఇక ఇది స్పోర్ట్స్ బైక్ కావడం వల్ల ఇందులో నార్మల్ ,స్పోర్ట్స్, ఏకో అని 3 రైడింగ్ మోడ్ ఆప్షన్స్ ఉండడం వల్ల కస్టమర్లకు మరింత ప్రయోజనకరంగా మారనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: