యంగ్ హీరో అడవి శేషు నటించిన సినిమాలు తక్కువే అయినా విలక్షణ నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ‘గూఢచారి’ అన్న ఒక వెరైటీ సబ్జెక్ట్ తో తీస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. 

ఈమూవీలో అడవిశేషు పక్కన శోభితా ధూళిపాళ హీరోయిన్ గా నటిస్తోంది. చిన్న సినిమాగా మొదలైన ఈసినిమా ఇప్పుడు పెద్ద సినిమాగా మారినట్లు వార్తలు వస్తున్నాయి.  దీనికి కారణం ఈ సినిమాలో జగపతిబాబు ప్రకాష్ రాజ్ లు రెండు ప్రధాన పాత్రలలో నటించబోతున్నారు. 

దీనికితోడు ఈసినిమాకు అనుకోకుండా మరొక ఊహించని ట్విస్ట్ వచ్చినట్లుగా తెలుస్తోంది.  ఈసినిమా నిర్మాత అభిషేక్ నామా ఇస్తున్న లీకుల ప్రకారం ఈసినిమాలో ఒక ప్రత్యేక పాత్రను పోషించవలసిందిగా ఈసినిమా నిర్మాత సూపర్ స్టార్ కృష్ణ పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఈసినిమా టైటిల్ ‘గూఢచారి’ అని నిర్ణయించడంతో ఆంధ్రా జేమ్స్ బాండ్ గా పేరు గాంచిన కృష్ణ ఒక కీలకమైన ప్రత్యేక పాత్రలో కనిపిస్తే బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే సూపర్ స్టార్ కృష్ణ మాత్రం తాను ప్రస్తుతం సినిమాలలో నటించే ఉద్దేశ్యం లేదని అంతగా అవసరం అనుకుంటే ఈసినిమా కథకు సంబంధించి తాను గతంలో నటించిన ‘జేమ్స్ బాండ్’ సినిమాల క్లిపింగ్స్ ను వాడుకోమని సలహా ఇచ్చినట్లు టాక్. అయినా ఈసినిమా నిర్మాతలు కృష్ణ పై తమ ఒత్తిడిని కొనసాగిస్తూనే ఉన్నారని వార్తలు వస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: