భారత దేశంలో అవినీతి నిర్మూలన కోసం పోరాడిన వ్యక్తుల్లో అన్నా హాజారే ఒకరు. సైనికుడిగా పనిచేసిన ఆయన గ్రామాల అభివృద్ది కోసం ఒక రైతుగా ఎన్నో వినూత్న ప్రయోగాలు చేసి వ్యవసాయంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. , భారతదేశం లోని మహారాష్ట్రలో ఉన్న అహ్మద్నగర్ జిల్లాలో రాలెగావ్ సిద్ధి గ్రామ అభివృద్ధికి చేసిన తోడ్పాటుకు ఈయన ప్రత్యేక గుర్తింపు పొందాడు. దీనిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటానికి తను చేసిన ప్రయత్నాలకు గుర్తుగా 1990 లో పద్మశ్రీ అవార్డు తోనూ, 1992 లో పద్మ భూషణ్ అవార్డుతోను భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై పోరాడేందుకోసం తను చేపట్టిన కృషిలో భాగంగా అన్నా, భారత్లో సమాచార హక్కు లక్ష్యం కోసం పాటుపడిన ప్రముఖ వ్యక్తులలో ఒకడిగా నిలిచాడు. 5 ఏప్రిల్ 2011 న జనలోక్ పాల్ చట్టాన్ని పోలినట్లు లోక్ పాల్ అవినీతి నిరోధక చట్టాన్ని తేవాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిరవధిక నిరాహరదీక్ష చేపట్టాడు. దేశమంతా దీనికి మద్దతు లభించింది. 9 ఏప్రిల్ 2011 న ప్రభుత్వము అంగీకరించిన తరువాత నిరాహారదీక్ష విరమించాడు.
నేటి తరం చిన్న పిల్లలు ఎవరితోనైనా ఫ్రీగా మాట్లాడతారు. ఎప్పుడైనా నిజాలే మాట్లాడతారు. మరీ అలాంటి వారు నేడు సోసైటీ లో నెలకొన్న అపరిశుభ్రత, అంటరానితనం, ఆర్దిక నేరాలను ఎలా అరికట్టారన్న కథాశంతో తెరకెక్కుతోన్న చిత్రమే" బచ్చె కచ్చె సచ్చె" . హిందీ లో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 2 విడుదల కానుంది. గతంలో తెలుగులో అధినేత, సరదాగా కాసేపు లాంటి సినిమాలను నిర్మించిన రవి సదాశివ్ స్వీయ దర్శకత్వంలో "బచ్చె కచ్చెసచ్చె " చిత్రాన్ని తెరకెక్కించారు.