ఒకప్పుడు టాలీవుడ్ లో శివ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ, అక్కినేని నాగార్జున మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత కలిసి ‘ఆఫీసర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతంలో శ్రీదేవి, నాగార్జునతో ‘గోవింద గోవింద’ సినిమాతో వచ్చినప్పటికీ అది పెద్దగా సక్సెస్ కాలేదు. దాంతో వీరి మద్య చాలా గ్యాప్ వచ్చింది.
ప్రస్తుతం ‘ఆఫీసర్’ షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా..తాజాగా రెండో టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ చూస్తుంటే..ఓ అమ్మాయిని రక్షించడానికి నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా ఎన్నో కష్టాలు పడుతున్నారు. ‘పాలిటిక్స్... మాఫియాల్లో బయటకు కనిపించేవి నిజం కావు’ అంటూ విలన్ హెచ్చరిక చేస్తోన్న ఓ డైలాగును ఇందులో వినిపించారు.
‘ప్రతి మనిషిలోనూ దేవుడు, రాక్షసుడు ఉంటారు’ అని నాగార్జున ఓ డైలాగు కొట్టాడు.‘నువ్వు నన్ను నమ్ముతావా’ అని నాగార్జున అడగగా.. ‘మీకన్నా ఎక్కువగా’ అంటూ ఓ పాప పలికే డైలాగును కూడా ఇందులో వినిపించారు. కాగా, ఈ సినిమా ట్రైలర్ను ఈ నెల 12న విడుదల చేయనున్నారు.
సినిమాలో యాక్షన్, సెంటిమెంట్ తో పాటు మాఫియా తో మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నట్లు రాంగోపాల్ వర్మ ఇప్పటికే చెబుతూ వస్తున్నారు. ఆఫీసర్ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. కంపెనీ పతాకంపై రామ్గోపాల్వర్మ, సుధీర్ చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.