ఆ మద్య మెగాస్టార్ ఫ్యామిలీ లో ఎన్నో చీలికలు వచ్చాయని..ముఖ్యంగా చిరు, పవన్ ల మద్య కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయని రూమర్లు వచ్చాయి. కానీ అవన్నీ పటాపంచలు చేస్తూ..సర్ధార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకకు చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా పిలవడమే కాదు...అన్నదమ్ములు ఎంతో అన్యోన్యతతో సెల్ఫీ ఫోటోలు కూడా దిగారు. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 చిత్రంలో నటించినందుకు ప్రత్యేకంగా అన్నయ్య ఇంటికి వెల్లి అభినందనలు తెలిపారు పవన్ కళ్యాన్. దాంతో చిరు, పవన్ ల మద్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని తెటతెల్లం అయ్యింది.
ఈ మద్య శ్రీరెడ్డి విషయంలో నాగబాబు తన తమ్ముడు పవన్ కళ్యాన్ గురించి ఓ రేంజ్ లో పొగిడారు. అంతే కాదు ఫిలిమ్ ఛాంబర్ వద్ద అన్నదమ్ములు హల్ చల్ చేశారు. ఇదే సమయంలో అల్లు అర్జున్ వెళ్లి పవన్ కళ్యాన్ ని ఆలింగనం చేసుకోవడంతో ఇటు పవన్ , బన్నీల మద్య కూడా ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని తేలిపోయింది.
అయితే ఆ మద్య సరైనోడు సినిమా విషయంలో అల్లు అర్జున్ ‘చెప్పను బ్రదర్’ అనే కామెంట్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ బన్నీపై దుమ్మెత్తిపోశారు. నానా యాగీ చేశారు..ఆ తర్వాత కూడా మరో ఫంక్షన్లో బన్నీ ఇదే విషయం చెప్పడంతో పవన్, బన్నీల మద్య పెద్ద వివాదం నడుస్తుందని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే..ఈ మద్య బన్నీ నటించిన ‘నా పేరు సూర్య’సినిమా ఫంక్షన్ కి పవన్ కళ్యాన్ ముఖ్య అతిధిగా రావడం..మెగా అభిమానుల్లో సంతోషం రేకెత్తించాయి.
ఈమద్యే బన్నీ కూడా రానున్న ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తరుపున ప్రచారం చేయడానికి సిద్ధమని ప్రకటించాడు.తాజాగా అల్లు అర్జున్ తన ఫేస్ బుక్ ఖాతాలో పవర్ స్టార్కి మద్దతు ప్రకటిస్తూ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. "లివ్ బై యువర్ ట్రూ మ్యాడ్నెస్ ద వరల్డ్ విల్ అడ్జస్ట్" అని అల్లు అర్జున్ రాసిన ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.