1960లలో ఆచార్య రజినీష్గా, 1970-1980లలో భగవాన్ శ్రీ రజినీష్ గా ఆ తరువాత ఓషోగా పిలువబడిన ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. ఇండియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలతో సహా ఎన్నో దేశాలలో నివసించి ఓషో మూవ్మెంట్ అనే ఒక వివాదాస్పదమైన కొత్త ఆధ్యాత్మిక సంఘాన్ని తయారుచేశాడు. ఇతడు మధ్యప్రదేశ్లో గల నర్సింగ్పూర్ జిల్లాలో ఉన్న కుచ్వాడాలో 1931న జన్మించాడు..1990 న మరణించాడు. ఈ మద్య బాలీవుడ్ మొదలుకొని ఇటు టాలీవుడ్ వరకూ అంతటా బయోపిక్ల హడావుడి నడుస్తోంది.
ఈ నేపథ్యంలో శృంగార సంబంధిత ప్రవచనాలతో ఆధ్యాత్మికను ప్రభోదించిన ఓషో జీవితం ఆధారంగా సినిమా నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖులు అమిర్ఖాన్, కరణ్ జోహార్ ఈ సినిమా రూపకల్పనకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో అమిర్ ఖాన్ నటించిన ‘దంగల్’ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
కాగా ఓషో బయోపిక్కు శకున్ బత్రా దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకుముందు ‘కపూర్ అండ్ సన్స్’ రూపొందించారు. అయితే ఓషో సినిమా చేయడానికి అమీర్ ఖాన్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారని..స్క్రిప్ట్ వినగానే ఆయన ఓకే చేశారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమీర్ ఖాన్ ‘ఠగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ చిత్ర ప్రొమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.