మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ సినిమాకు ఊహించని విధంగా ప్రభాస్ ‘సాహో’ నుండి వచ్చే సమ్మర్ సీజన్ లో పోటీ వస్తుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ముందుగానే చిరంజీవి ఎలర్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో హడావిడిచేస్తున్న వార్తల ప్రకారం చిరంజీవి ఈమధ్య ‘సాహో’ నిర్మాతలను తన ఇంటికి పిలిపించుకుని ‘సాహో’ రిలీజ్ ప్లాన్ గురించి అడగడమే కాకుండా ప్రస్తుతం తన భారీ మూవీ ‘సైరా’ గురించి కూడ వారికి వివరంగా వివరించినట్లు టాక్.
Chiranjeevi
ఎట్టి పరిస్తుతులలోను ‘సాహో’ ‘సైరా’ ల రిలీజ్ డేట్స్ మధ్య కనీసం 45 రోజులు గ్యాప్ ఉండాలని అలా లేకుంటే ఇరు సినిమాలకు నష్టం అన్న పద్ధతిలో చిరంజీవి తనదైన స్టైల్ లో ప్రభాస్ సన్నిహితులైన ‘సాహో’ నిర్మాతలకు వివరించినట్లు టాక్. దీనితో ఎలర్ట్ అయిన ‘సాహో’ నిర్మాతలు తమ మూవీని ఖచ్చితంగా ‘సైరా’ కంటే ముందు విడుదల చేస్తామని సూచన ప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది. 
First look of Sye Raa Narayana Reddy
ఇది ఇలా ఉండగా గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలతో ‘సైరా’ షెడ్యూలును బాగా దెబ్బతీసాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈసినిమాకు సంబంధించి కేవలం 30 శాతం వర్క్ అయి ఉంటుందని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు చిత్రీకరించిన సీన్స్ చాల మటుకు కీలకం కావడమే కాకుండా ఆసీన్స్ కు గ్రాఫిక్స్ తో బాగా సంబంధం ఉన్న నేపధ్యంలో ఇప్పటికే ఫినిష్ అయిన సీన్స్ కు గ్రాఫిక్ పనులు మొదలు పెట్టినట్లు టాక్.
Amitabh Bachchan Shares Pics From Sets Of Chiranjeevi's Film. See His Final Look
చిరంజీవి ఎంత శ్రద్ధ పట్టినా ఈమూవీ వర్క్ ప్రస్తుత పరిస్తుతులను పరిగణలోకి తీసుకుంటే ఈమూవీని సమ్మర్ కు రిలీజ్ చేయడం కష్టం అనీ దసరాకు కానీ పోస్ట్ సమ్మర్ సీజన్ కు మాత్రమే రెడీ కాబోతున్న నేపధ్యంలో చిరంజీవి ఇలా కావాలని ప్రభాస్ ‘సాహో’ కు లైన్ క్లియర్ చేసినట్లుగా గుంభనంగా వ్యవహరిస్తున్నాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరో రెండు రోజులలో విడుదల కాబోతున్న ‘సైరా’ టీజర్ మ్యానియా తరువాత ఈ వ్యూహాలలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: