ప్రభాస్ హీరోగా చేస్తున్న సాహో మూవీ విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి కాకపోవడంతో సినిమాను ఆగష్టు 15 నుంచి 30 వ తేదీకి పోస్ట్ ఫోన్ చేశారు. రెండు వారాల వ్యవధి పెరిగింది కాబట్టి ఆ గ్యాప్ లో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొత్తం పూర్తి చేసి ప్రమోషన్స్ షురూ చేయాలనీ యూనిట్ సంకల్పంగా పెట్టుకుంది.
సినిమా ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా ప్రమోషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదిలా ఉంటె, ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది. సాహో ఫస్ట్ హాఫ్ ను ఇప్పటికే ఫినిష్ చేసి లాక్ చేసినట్టు సమాచారం.
దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను కూడా జిబ్రాన్ పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. సెకండ్ హాఫ్ కు సంబంధించిన వర్క్స్ జరుగుతున్నది. దీన్ని కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేస్తారట. ఎక్కడా రాజీపడకుండా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను చేస్తున్నారు.
ఇప్పటికే ట్రైలర్ కు సంబంధించిన వర్క్ కూడా పూర్తయింది. టోటల్ గా ఒకసారి చెక్ చేసుకొని ఒకే అనుకున్నాక ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతోంది. అంచనాలు భారీగా ఉన్నాయి.