వరుస ప్లాప్స్ తో సతమతమైన యువ సామ్రాట్ నాగ చైతన్య ఎట్టకేలకు మజిలీతో పరాజయాల పరంపరకు బ్రేక్ వేసుకున్నాడు. ఈ ఏడాది సమ్మర్ లో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఇక ఈ చిత్రం తరువాత ప్రస్తుతం చైతన్య , విక్టరీ వెంకటేశ్ తో కలిసి 'వెంకీ మామ' చిత్రంలో నటిస్తున్నాడు. గత కొద్దీ నెలల నుండి రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ చిత్రం తుది దశకు చేరుకుంది. దసరా కు ఈసినిమాను విడుదలచేయనున్నారు.
ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసి నాగ చైతన్య , శేఖర్ కమ్ములతో ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్. ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా రానున్నడంతో అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక వారికీ కిక్ ఇచ్చే న్యూస్ ఏంటంటే ఈసినిమాలో చైతూ .. తెలంగాణ స్లాంగ్ లో డైలాగులు చెప్పనున్నాడు. అందుకోసం ప్రాక్టీస్ ను కూడా ప్రారంభించాడు. ఈ సినిమాతో ఫస్ట్ టైం చైతన్య యాసతో ఆకట్టుకోనున్నాడు.
కాగా ఫిదా సినిమాలో కూడా సాయి పల్లవితో తెలంగాణ స్లాంగ్ లో డైలాగులు చెప్పించి సినిమాను బ్లాక్ బాస్టర్ హిట్ చేయించాడు శేఖర్ కమ్ముల. ఈసినిమా సాయి పల్లవి కి క్రేజ్ ను తెచ్చిపెట్టడంతో పాటు ఆమె కెరీర్ బ్రేక్ ఇచ్చింది. మరి ఇప్పుడు శేఖర్ కమ్ముల .. చైతన్య తో కూడా అలానే చేయించనున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ఈనెల 25 నుండి స్టార్ట్ కానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నారాయణ దాస్ నారంగ్ , రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించనున్నారు.