బిగ్బాస్ తెలుగు సీజన్ 3 లో అతిథి హోస్ట్గా రమ్యకృష్ణ అదరగొట్టేసింది. ఆదివారంను ఫన్ డేగా మలచడంతో తనదైన సత్తాను చాటునుండి ఈ శివగామి. ఇంటి సభ్యులతో వినోదాత్మక గేమ్స్ ఆడించడమే కాకుండా ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని కూడా నింపారు. అలాగే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి , ఇంటి సభ్యులతో మమేకమయ్యారు.
సండే ఈజ్ ద ఫండే అంటూ షో స్టార్ట్ చేసిన రమ్యకృష్ణ .. హౌస్ మేట్స్ కి సీన్ చేయండి అనే టాస్క్ ఇచ్చింది. ఈ టాస్క్ లో రవికృష్ణ, అలీ రెజాకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు సినిమాలోని మహేష్ పూల కుండి పగులగొట్టే సీన్ను ఇచ్చారు. ఈ సీన్ లో రవి , అలీ లు తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఆ తరువాత శివజ్యోతి, మహేష్ విట్ట, హిమజకు రంగస్థలంలోని ఓ సీన్ను ఇచ్చారు. మహేష్ రాంచరణ్గా, శివజ్యోతి రంగమ్మగా, హిమజ సమంతగా యాక్ట్ చేశారు. రంగమ్మత్త, చిట్టిబాబు, సమంతగా ముగ్గురు బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ తరువాత బాబా భాస్కర్, శ్రీముఖిలు హౌస్లో చంద్రముఖి సినిమా చూపించేశారు. చంద్రముఖిలా శ్రీముఖి శివతాండవం చేస్తే.. రజినీకాంత్లా బాబా భాస్కర్ ఇరగదీశారు. చంద్రముఖి సీరియస్ సీన్కి కామెడీని మిక్స్ చేసి ఫుల్ ఫన్ నింపారు. చంద్రముఖిలా మారిన శ్రీముఖి వీరవిహారం చేస్తుంటే.. నువ్ కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు ఉన్నావ్ అంటూ కామెడీ యాడ్ చేశారు బాబా భాస్కర్. శ్రీముఖి అయితే చంద్రముఖి నిజంగానే పూనినట్టుగా నాట్యంతో వీరవిహారం చేసింది. బాబా భాస్కర్ తన కొరియోగ్రఫీ టాలెంట్ను మిక్స్ చేసి అందరిని ఆకట్టుకున్నారు.
ఇక రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాళంను ఓ జంటగా మార్చి.. ఖుషీ సీన్లోని నడుము చూసే సీన్ను చేయాలని సూచించారు. ఇక పునర్నవి, రాహుల్ ఆ పాత్రల్లో జీవించారు. రాహుల్ తనదైన స్టయిల్లో, డైలాగ్స్తో రఫాడించారు. నా మీద నీకు ప్రేమ లేదా అంటే .. నా మీద నీకు ప్రేమ లేదా అంటూ చెప్పిన డైలాగ్స్తో వారిద్దరి కెమిస్ట్రీ అదిరింది. అంతలో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే పాటను ప్లే చేయగా వారిద్దరూ డ్యాన్స్ చేశారు. ఇక నిజ జీవితంలో జంట ఐన వితిక , వరుణ్ కి సరిగ్గా సెట్టయ్యేలా టాస్క్ ఇచ్చారు రమ్యకృష్ణ. పెళ్లికి ముందు.. పెళ్లికి తర్వాత పరిస్థితులను క్రియేట్ చేసుకొని వారిద్దరూ బాగా నటించారు. మల్లెపూలు సీన్ ఆకట్టుకొన్నది. బిగ్బాస్లోకి వచ్చాక ముద్దు, మురిపాలు లేవని అంటే.. ఇక్కడ ముద్దులు పెట్టుకొంటే బాగుండదు అని వరుణ్ చెప్పుకొచ్చాడు. ఇక ఫన్ గేమ్ ముగిసిన తర్వాత ఇంటి సభ్యులు, తాను ఇచ్చిన మార్కుల ఆధారంగా విజేతను నిర్ణయించారు. అత్యధిక మార్కులు వచ్చిన బాబా మాస్టర్, శ్రీముఖి జంట విజేతగా నిలిచింది.
అనంతరం నల్లటి గులాబీలతో ఓ ఆట ఆడించింది. ఎక్కువగా నల్లపూలు వచ్చిన వారు ఇంటి నుంచి బయటకు వెళుతారని చెప్పింది. ఆ గేమ్లో మహేష్ విట్టకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. కంటెస్టెంట్స్తో డైరెక్ట్గా ముచ్చటించేందుకు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లింది. హౌస్ అంతా కలియతిరుగుతూ మధ్య మధ్యలో పంచ్లు పేలుస్తూ.. నామినేషన్ ఉన్న హిమజ, పునర్నవి, మహేష్లను టెన్షన్ పెట్టారు. ఇక కీలకమైన ఎలిమినేషన్లో ఉన్న ముగ్గురికి శివగామి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈవారం ఎలిమినేషన్ లేదంటూ సర్ ప్రైజ్ ఇచ్చింది. మరోవైపు వినాయక చవితి సందర్భంగా హౌస్ మేట్స్తో కలిసి గణపతి పప్పా అంటూ అదిరిపోయే స్టెప్పులను వేశారు రమ్యక్రిష్ణ. చివర్లో శివగామిగా మహేంద్ర బాహుబలి అంటూ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళిపోయింది. మొత్తంగా చాల రోజుల తరువాత బిగ్ బాస్ చాల ఫన్నీ గా సాగింది.