సూపర్స్టార్ అభిమానులు ఎంతగానో ఎదరుచూస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్ర టీజర్ విడుదలయ్యింది. మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేశ్ అదరగొట్టారు. ఆయన చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు. ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు.’ అని మహేశ్ను ఉద్దేశిస్తూ ప్రకాశ్రాజ్ చెప్పిన డైలాగ్ దుమ్ములేపింది. భయపడేవాడే బేరాలకొస్తాడు. మన దగ్గర బేరాల్లేవమ్మా..’ అని సూపర్ స్టార్ మహేశ్ బాబు చెప్పిన డైలాగ్ అభిమానులతో విజిల్స్ వేయిస్తోంది.
మీరు ఎవరో మాకు తెలియదు.. మీకు మాకు ఏ రక్త సంబంధం లేదు.. కాని మీ కోసం మీ పిల్లల కోసం ఎండ వాన అని లేకుండా పోరాడుతూనే ఉంటాం ఎందుకంటే మీరు మా బాధ్యత’ అంటూ మహేష్ బాబు డైలాగ్తో టీజర్ మొదలు అవుతుంది. మీరంతా నేను కాపాడుకునే ప్రాణాలురా.. మిమ్మల్ని ఎలా చంపుకుంటానురా.. మీ కోసం ప్రాణాలను ఇస్తున్నాం రా అక్కడ. మీరేమో కత్తులు గొడ్డలు వేసుకుని ఆడాళ్ల మీద. బాధ్యత ఉండక్కర్లా’ అంటూ మహేష్ చెప్తున్న డైలాగ్ అనీల్ రావిపూడి మార్క్లో చాలా ఫన్నీగా ఉంది.
చాలా కాలం తరువాత మేకప్ వేసుకున్న వినయశాంతి 'గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు బాబాయ్’ అనే డైలాగ్ తో అదరగొట్టింది. సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి మాస్, ఎంటర్టైనర్గా తీర్చిదిద్దారు. ఆర్మీ అధికారి అయిన మహేశ్కు కర్నూలులో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఎలా ఎదుర్కొన్నారు అనేదే కథ అని అర్ధం అవుతుంది. సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విడుదల తేదీ మారింది. తొలుత అనుకున్నరోజు కంటే ఒక్కరోజు ముందుగా.. అనగా జనవరి 11న ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలుగు చిత్ర నిర్మాతల సంఘం తెలిపింది. సూపర్స్టార్ మహేశ్బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించుకుంది.