సాధారణంగా చాలా మందికి స్టేజి భయం ఉంటది.. అంతమంది ప్రేక్షకులని చూస్తే మాట్లాడాలంటే ఎవరికన్నా మాటలు తడబడతాయి. సరిగా మాట్లాడలేరు అలాంటి కోవలోకి మన 'వెంకీ మామ' కూడా వస్తారు.వెంకటేష్ మరియి నాగ చైతన్య కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ లో రాశీఖన్నా, పాయల్ రాజపుత్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ నెలలో 13 వ తేదీన థియేటర్లో సందడి చేయనుంది..
దీని మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇ మూవీ ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారు. వేదికపై అసలు ఎపుడు మాట్లాడలేరు వెంకటేష్ కాని ఈసారి వెంకటేష్ మాటలు అదరగొట్టేసాడు. అందరి ని పగలపడి నవ్వించాడు. ''ఓ దేవుడా నీకు చాలా థాంక్స్ దేవుడా ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్నాము ఫైనల్ గా డిసెంబర్ 13 నా విడుదల చేస్తున్నావ్" అని అన్నారు. చాలా టెన్షన్ గా ఉంది అని అన్నారు. వెంకిమామ.
అలానే సురేష్ ప్రొడక్షన్స్ కి, మీకు థాంక్స్ అన్నయ్య అని అన్నారు . స్టేజి మీద మాట్లాడాలంటే చాలా కష్టం. 30 ఏళ్ల నుంచి ఇదే తంతు., ఈ స్టేజి ఎక్కడం, మాటలు రాకపోవడం, తడబడడం, అదేంటో వచ్చిన వాళ్ళు అందరు నేర్చేసుకుంటున్నారు . నాకు మాత్రం రావట్లేదు అన్నారు... నేను, నాగ చైతన్య కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది
మ నాన్నగారు బ్రతికి ఉంటే చాలా సంతోషించే వారు. అయనకి మ కుటుంబంలో అందరితో కలిసి ఒక సినిమా చేయాలనీ కోరిక ఉండేదని తెలియచేసారు. "నాన్న ఈ సినిమా మీకోసమే "అని అన్నారు.. అలాగే f2 తర్వాత వచ్చే సినిమా ఇది అని, ఇదొక డిఫెరెంట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ మూవీ అని తెలిపారు. "నా జీవితంలో ఎన్నో సినిమాలు చేశాను కాని 'వెంకిమామ' తో నా కల నెరవేరింది "అన్నారు.
ఈ మూవీ నాగ చైతన్య కెరీర్ లో బెస్ట్ మూవీ అవ్వాలని అన్నారు. ఈ సినిమా కి మా అన్నయ్య సురేష్ చాలా కష్ట పడ్డాడు అని తెలిపారు.. అలాగే రాశి ఖన్నా, పాయల్, ప్రకాశరావ్, రావురమేష్ తో పనిచేయడం చాలా ఆనందం గా ఉంది అన్నారు.. ఈ సినిమా మీకు బాగా నచ్చుతుంది అన్నారు . ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు వెంకిమామ సినిమా ఎలా ఉంటుందో అని.. అల్ ది బెస్ట్ ఒన్స్ అగైన్ "వెంకిమామ "