పవర్స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత తిరిగి సినిమాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన రాజకీయాల్లో బిజీ అయిపోవడం వల్ల సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. దీంతో చాలా కాలం వరకు ఫ్యాన్స్లో ఆయన మళ్ళీ సినిమాల్లోకి వస్తారో రారో అని అనుమానాలు కూడా వచ్చాయి. అంతేకాక పవన్ కూడా సినిమాల్లో చేయను అంటూ ఒకటి రెండు సార్లు చెప్పారు. కానీ ఫ్యాన్స్ కోసం అలాగే ఆయన ఆర్ధిక అవసరాల దృష్ట్యా ఆయన మళ్లీ సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఏకంగా ఒకేసారి మూడు సినిమాలు మొదలు పెట్టాడు.
మొదటి సినిమా దిల్రాజు, బోనీకపూర్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న పింక్ రీమేక్ చిత్రంలో నటిస్తుండగా. ఈ చిత్రం ఆల్రెడీ సెట్స్ మీదకు వెళ్ళి షూటింగ్ కూడా జరుపుకుంటుంది. తర్వాత క్రిష్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు పవన్ ఆ చిత్రాన్ని ఎ.ఎంరత్నం నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతోంది. ఇక మూడోది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోతుంది. ఇక ఇదిలా ఉంటే మూడు సినిమాలతో పాటు మరో సినిమాను కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారనా సమాచారం.
అదివరకు పవన్ ఏడాదికి ఒక సినిమా చేస్తే ఫ్యాన్స్ కి పండగ. మరి ఇప్పుడు ఆయన ఉండే బిజీ లైఫ్కి ఏకంగా నాలుగు సినిమాలు చేయడానికి ఆయన రెఢీగా ఉన్నారంటే గ్రేట్ అనే చెప్పాలి. అయితే ఈ విషయం పై ఫ్యాన్స్ పండగ మాములుగా లేదనే చెప్పాలి. చాలా స్పీడ్ గా సినిమాలు చేసి ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడి ఆ తర్వాత మళ్లీ సినిమాలకకు దూరంగా ఉండాలనేది పవన్ నిర్ణయం కావచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.
ఇప్పటికే మూడు సినిమాలు పవన్వి కన్ఫర్మ్ అయితే. ఆల్రెడీ రెండు చిత్రాలు షూటింగ్ కూడా మొదలయిపోయాయి. ఇక నాలుగవ సినిమా డైరెక్టర్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఒక్కో సినిమాకి చాలా తక్కువ సమయం ఇస్తూ పక్కా ప్లాన్తో వెళుతున్నాడు పవన్. అందుకు అనుగుణంగా సినిమాను ప్లాన్ చేసుకోవాలంటూ నిర్మాతలకు మరియు దర్శకులకు పవన్ సూచిస్తున్నారని సమాచారం.