బిగ్ బాస్ 3 తో వెలుగులోకి వచ్చిన అమ్మాయి పునర్నవి భూపాలం. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈమె హీరోయిన్ గా చేస్తుంది ఎవరో హీరోతో అనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు వస్తున్నా పాప మాత్రం యాంకర్ గా అవకాశం కోసం తీవ్రంగా కష్టపడుతుంది అనే టాక్ ఎక్కువగా వినపడుతుంది.

 

ఇందుకోసం ప్రముఖ దర్శకుడిని కూడా కలిసి తనకు సహాయం చెయ్యాలని కూడా కోరినట్టు సమాచారం. తాను యాంకర్ గా అడుగు పెట్టాలి అనుకుంటున్నా అని, అదిరింది లేదా మరో షో కి తనకు అవకాశం ఇవ్వాలని ఆమె కోరినట్టు సమాచారం. దీనికి సదరు దర్శకుడు కూడా సహాయం చేస్తాను అని చెప్పినట్టు సమాచారం.

 

ఇక ఇదిలా ఉంటే అనసూయ మీద ఈమె యేవో కామెంట్స్ ఎవరి వద్దో చేసినట్టు సమాచారం. తాను జబర్దస్త్ షో కి పనికి వస్తా అని, అనసూయ కంటే తాను బెటర్ గా యాంకరింగ్ చేస్తా అని తనకు అవకాశం ఇస్తే ప్రూవ్ చేసుకుంటా అని చెప్పినట్టు సమాచారం.ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి అనసూయ వద్దకు వెళ్లినట్టు తెలుస్తుంది. దీనిపై అనసూయ ఆగ్రహంగా మరొకరి వద్ద మండిపడిందని అంటున్నారు. ఆమె చేసుకునేది ఆమె చేసుకోవచ్చు కదా అంటూనే,ఎవరి గురించో ఆమెకు ఎందుకు అంటూ ఇలాంటి మాటలు అంటూ ఫైర్ అయిందని టాక్. 

 

ఇప్పటికే యాంకర్ గా అవకాశాల కోసం ఇంటర్వ్యూల ద్వారా ఆమె ప్రయత్నాలు చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాన్స్ పెట్టే కామెంట్స్ ని చదువుతూ యాంకర్ అయితే బాగుంటుంది అని భావిస్తున్నట్టు టాక్. సోషల్ మీడియా పుణ్యమా అని హైలెట్ అయిన ఈ భామ ఇప్పుడు కాస్త హుషారుగా ఉంటూనే ఇబ్బందులను కూడా కొని తెచ్చుకుంటుంది అంటున్నారు. ప్రస్తుత౦ దీనికి సంబంధించి కొన్ని పోస్ట్ లు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: