యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా నాలుగు చిత్రాలు లైన్లో వున్నాయి. వెంకీ అట్లూరి `రంగ్ దే`, చంద్రశేఖర్ ఏలేటి `ఛెక్`, కృష్ణ చైతన్య `పవర్ పేట`, వెంకీ కుడుముల `భీష్మ`. ఈ నాలుగు చిత్రాల్లో మూడు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో ఉన్నాయి. ఇక వీటిల్లో ముందు ఛలో దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేసే భీష్మ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఛలో సినిమాతో పాపులర్ దర్శకుడు అయిన వెంకీ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్. దీంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. రష్మిక ఇటీవల తెలుగులో పాపులర్ హీరోయిన్ అయ్యింది. దీంతో నితిన్ - రష్మిక జోడీ ఎలా ఉంటుందా ? అన్న ఆసక్తి సహజంగానే అందరిలోనూ ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఇటీవలే షాలిని రెడ్డితో నితిన్ పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. దీంతో సహజంగానే ఈ సినిమాపై నితిన్ పెళ్లి ఎఫెక్ట్ పడినట్లయ్యింది. లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కల్యాణం ప్లాపులతో ఉన్నా కూడా నితిన్ నటించిన భీష్మకు మంచి బిజినెస్ జరిగింది. రు. 23 కోట్ల బడ్జెట్తో నిర్మించిన భీష్మకు రు. 33 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే పెట్టిన పెట్టుబడికి 10 కోట్ల ప్రాఫిట్ వచ్చిందన్న మాట.
ఇలా నితిన్ నటించిన ఓ చిత్రానికి రిలీజ్కు ముందు టేబిల్ ప్రాఫిట్ రావడం ఇదే ఫస్ట్ టైం కావడంతో వాళ్ల ఆనందానికి అవధులే లేవు. రష్మిక గ్లామర్, నితిన్ పెళ్లి.. వెంకీ కుడుముల ప్రామీసింగ్ డైరెక్షన్ ఇవన్నీ ఈ సినిమాకు కలిసొచ్చాయన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది.