మెగాస్టార్ చిరంజీవి ఏ పని చేసినా దాని వెనక పెద్ద సినీ రాజకీయం ఉంటుందని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఇటీవల మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి హాజరయ్యారన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో తను పదినిమిషాల పాటు బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చి మహేష్ బాబు చిత్రాన్ని ఓ లెవెల్ లో ప్రమోట్ చేసారు. అయితే చిరంజీవి మహేష్ బాబుకి ఫేవర్ చేసే ముందే తాను ఒక ఫేవర్ ఆశించే ఈ ప్రమోషన్ ఈవెంటుకి హాజరయ్యారని సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ఆ ఫేవర్ ఏంటంటే చిరంజీవి తన తదుపరి చిత్రంలో మహేష్ బాబుని నటించమని పరోక్షంగా అడుగుతున్నారట. 

Image


వివరాలు తెలుసుకుంటే... కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ చిత్రం ఆచార్యలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక కీలకమైన పాత్రలో నటించనున్నారట. ఈ చిత్రంలోని అతి ముఖ్యమైన పాత్ర గురించి మహేష్ బాబుకి వినిపించినప్పుడు... సూపర్ స్టార్ దానికి ఓకే చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతోంది. సరిలేరు నీకెవ్వరుకి చిరంజీవి తన వంతుగా ప్రమోట్ చేశాడు కాబట్టి... ఈ చిత్రానికి నో చెప్పి తనకి మంచి చేసిన చిరుని నొప్పించకూడదని మహేష్ బాబు భావించారట. అందుకే ఆచార్య సినిమాలోని ఓ పాత్ర గురించి వినగానే వెంటనే అంగీకరించారట.

Image


మరో వైపు కొరటాల శివ, మహేష్ బాబు కలసి భరత్ అనే నేను, శ్రీమంతుడు సినిమాలు తీశారు. ఆ క్రమంలోనే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహంతోనే ఓ పాత్రలో నటించేందుకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైనా సూపర్ స్టార్ మహేష్ బాబు ని చిరంజీవిని ఒకే స్క్రీన్ పైకి కనిపిస్తే చూడాలి అనుకునే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఒకవైపు చిరు ఫ్యాన్స్ మరొకవైపు మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని చూసేందుకు సినిమా థియేటర్లకు తండోపతండాలుగా వస్తారని చిరంజీవి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా చిత్ర బృందం నుండి ఎటువంటి ఆఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు కానీ విశ్వసనీయ వర్గాల నుండి ఈ విషయం గురించి బలంగా టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: