ఒక్క సినిమా ఫ్లాప్ అయింది అంటే చాలు మన వాళ్ళు చేసే హడావుడి ఒక రేంజ్ లో ఉంటుంది. అనవసర ప్రచారం చేస్తూ మీడియాలో నానా రాద్దాంతం చేస్తూ ఉంటారు కొందరు జనాలు. అసలు ఇక అవకాశాలే రావు వాళ్ళు అసలు అసలు సినిమాలే చేయరు, ఇక వాళ్ళ భవిష్యత్తు అయిపోయింది అంటూ లేని పోనీ ప్రచారాలు చేస్తూ లేని హడావుడిని సృష్టిస్తూ ఉంటారు. ఈ మధ్య ఇది కాస్త ఎక్కువైంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ముఖ్యంగా తెలుగు సినిమాల విషయంలో ఈ సొల్లు వార్తలు మరీ ఎక్కువగా వస్తున్నాయి అనేది అర్ధమవుతుంది.
తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా విషయంలో ఇదే ఒక హడావుడి ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఆమెకు సినిమా అవకాశాలు రావడం లేదు, జానూ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆమెకు అవకాశాలు వరించడం లేదు అంటూ కథనాలు వస్తున్నాయి. శర్వానంద్ హీరోగా దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించనున్న `మహాసముద్రం` సినిమాలో కథానాయికగా సమంతను తీసుకున్నారని ముందు కాస్త ప్రచారం ఎక్కువగా జరిగింది. తర్వాత సమంతను `మహాసముద్రం` నుంచి తప్పించారని, ఆమె స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరీని తీసుకున్నారన్నారు.
ఈ వార్తల నేపధ్యంలో అదితి రావు హైదరి ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అనవసర ప్రచారంపై మండిపడింది. ఈ మేరకు ఒక ట్వీట్ చేసింది. దీనికి సంబంధించి ఓ ఆంగ్ల వెబ్సైట్ వార్త రాసింది. ఆ వార్తను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ... “నేను ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. హిట్, ఫ్లాప్ అనేవి నటీనటుల సామర్థ్యాన్ని నిర్ణయించలేవు. దయచేసి మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి. ఇంకో విషయం ఏమిటంటే, ఓ సినిమా గురించి ప్రకటించే అవకాశం దర్శకులు, నిర్మాతలకే వదిలేయండి. ధన్యవాదాలు” అని కౌంటర్ ఇచ్చింది.
I genuinely feel this is important to say... a hit or flop cannot take away the credibility of an actor. Pl Let’s not encourage this kind of thinking.
— Aditi Rao Hydari (@aditiraohydari) February 23, 2020
secondly lets give a director/producer the respect to make their announcements in the way that they deem fit. Thank you 😊 https://t.co/1GOmREheud