అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. మరోవైపు ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రతి వారం జబర్దస్త్, లోకల్ గ్యాంగ్ కార్యక్రమాలకు సంబంధించి హాట్ ఫొటో షూట్లను తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తూ ఫ్యాన్స్కి టచ్లో ఉంటోంది యాంకర్ అనసూయ. ఇక అనసూయ కేవలం టీవీ యాంకరింగ్ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు మరో షోతో రాబోతుంది ఈ బ్యూటి.
ఈరోజుల్లో అన్ని ఛానెల్స్ లోను సరైన ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందా అంటే లేదని చెప్పాలి.కేవలం ఒకటి రెండు ఛానెల్స్ లో మాత్రమే మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుండగా మరోపక్క కొన్ని ఛానెల్స్ మాత్రం ఈ విషయంలో కాస్త వెనకబడిపోయాయి. అందులో జెమినీ టీవీ కూడా ఒకటి. అయితే ఇన్ని రోజులూ ప్రతీ వారాంతం ఒక సరికొత్త సినిమాతో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ను అందించిన జెమినీ టీవీ ఇప్పుడు ప్రతీ రోజు ఆ ఎంటెర్టైన్మెంట్ ను ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఆదివారం సినిమాలతో అయితే సోమవారం నుంచి శనివారం వరకు మొత్తం ఐదు సరికొత్త షోలతో ఎలెక్ట్రిఫయింగ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నారు.
కానీ ఏ రోజున ఏ షోను ప్రసారం చేస్తారు అన్నది వివరించలేదు. అయితే తాజాగా ఆ టైం వచ్చేసింది. వీరు మొట్ట మొదటగా యాంకర్ అనసూయ తోనే స్టార్ట్ చేసారు. వచ్చే మార్చ్ 2 సోమవారం నుంచి “తల్లా పెళ్ళామా” అనే బ్రాండ్ న్యూ ఎంటర్టైనింగ్ షోను ప్రసారం చేయనున్నట్టు తెలిపారు. మరి ఈ సరికొత్త షో ఎలా ఉండబోతుంది.. ఎంత వరకు సక్సెస్ అవుతుంది..? అన్నది చూడాలి. కాగా, మొత్తానికి జెమినీ టీవీ వారు సైలెంట్ గానే ఐదు షోలను ప్లాన్ చేసి తమ వీక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
ThallaPellama | Mar 2nd Onwards | Every Monday 9:30 PM
— Gemini TV (@GeminiTV) February 24, 2020
జెమినీ టీవీ వారు అందిస్తున్న సరికొత్త గేమ్ షో, తల్లా? పెళ్ళామా? ఈ మార్చ్ 2 తారీకు నుండి ఆంకర్ అనసూయచే ప్రారంభమవుతుంది.#Gemini #GeminiSocial #ThallaPellama @anusuyakhasba pic.twitter.com/JhwFP8mK1g