టాలీవుడ్ లో టాలెంట్ ఉంటే ఎవరైనా సత్తా చాటుకోవొచ్చు అంటారు. ఒకప్పుడు తన వద్ద ఓ కథ ఉందని పలువురు సినీ పెద్దలను సంప్రదించగా సున్నితంగా తిరస్కరించారు. కానీ అదే కథతో కొత్త నటుడితో తెరకెక్కించి భారీ విజయాన్ని నమోదు చేసుకున్న దర్శకుడు సందీప్ వంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసిన మొదటి సినిమాతోనే తన కంటూ క్రేజ్ ఏర్పాటు చేసుకున్నాడు. తెలుగు లో పెళ్లి చూపులు సినిమాతో మంచి విజయం అందుకున్న విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు సందీప్ వంగా. బోల్డ్ కంటెంట్ ఉందని విమర్శలు వచ్చినా.. యూత్ మాత్రం బాగా ఎట్రాక్ట్ అయ్యారు.
రిలీజ్ అయిన మొదటి రోజు కాస్త ఇబ్బంది పడ్డా.. తర్వాత రోజు నుంచి కలెక్షన్లు భారీగా రాబట్టడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు. దర్శకుడు సందీప్ వంగాకు ఈ చిత్రం తిరుగులేని గుర్తింపు తీసుకువచ్చింది. ప్రొఫెషనల్ గా సందీప్ వంగా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. సందీప్ వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషాలు వెల్లివిరిశాయి. తాజాగా సందీప్ వంగ మరోసారి తండ్రయ్యాడు. సందీప రెడ్డి సతీమణి మనీషా రెడ్డి ఈ మధ్యాహ్నం పండండి అమ్మాయికి జన్మనిచ్చింది.
అందుతున్న సమాచారం మేరకు తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. సందీప్, మనీషా 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు ఇప్పటికే ఓ బాబు ఉన్నాడు. తాజాగా తమ ఇంటికి పాప రావడం ఎంతో సంతోషంగా ఉందని తెగ సంబరపడిపోతున్నాడు ఈ దర్శకుడు. ఇక అర్జున్ రెడ్డి తెలుగు లో మంచి సక్సెస్ కావడంతో బాలీవుడ్ లో సైతం స్వయంగా ఆయనే దర్శకత్వం వహించాడు. కబీర్ సింగ్ గా తెరకెక్కించి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు.