తెలుగు చిత్ర పరిశ్రమలో అనుష్క కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం విషయం తెలిసిందే. సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అనుష్క... మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకొని తెలుగు ప్రేక్షకులందరూ చూపులు ఆకర్షించింది. అధిక అదిరిపోయే అందం తో అటు దర్శక నిర్మాతలను కూడా ఆకట్టుకునే ఎన్నో అవకాశాలు దక్కించుకుంది అనుష్క. ఇక స్టార్ హీరోలందరి సరసన ఛాన్స్ కొట్టేసి... ఎన్నో ఏళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు వస్తున్నప్పటికీ అనుష్క కు ఉన్న క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరదు. 

 

 

 ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాదు తన అందాల ఆరబోతతో తెలుగు ప్రేక్షకులందరికీ చమటలు పట్టిస్తూ పగటి కలలు కనేలా చేసింది అందాల ముద్దుగుమ్మ అనుష్క. అలా టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో... ఈ ముద్దుగుమ్మ జీరో సైజ్ అనే ప్రయోగాత్మక సినిమా చేసింది. ఈ సినిమాలు అప్పుడు వరకు నాజూగ్గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ సినిమా కోసం ఏకంగా 100 కిలోల వరకు బరువు పెరిగి పోయింది. ఇక ప్రయోగాత్మకంగా చేసిన జీరో సైజ్ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత ఈ అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. ఇక ఎన్నో ఏళ్ల పాటు కష్టపడుతూ బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంది అనుష్క. 

 

 

 ఈ సమయంలోనే బాహుబలి తో సంచలన విజయాన్ని అందుకొని మరోసారి తన సత్తా చాటింది. ఇక ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన భాగమతి  సినిమాలో నటించి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ప్రస్తుతం నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 2 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా  నిన్న అంగరంగ వైభవంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరైన రాజమౌళి పలు ఆసక్తికర ఈ విషయాలను వెల్లడించారు. అనుష్కతో విక్రమార్కుడు సినిమా చేస్తున్న సమయంలో.. ఏదైనా సీన్ నేను చేసి చూపిస్తే అనుష్క చేసేదని... ఈ సమయంలో రవితేజతో రొమాన్స్ కూడా నేనే చేసి చూ పెట్టాల్సి వచ్చింది అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇక రవితేజ తో రొమాన్స్ మొత్తం నేను చేసిన తర్వాత అనుష్క అలాగే చేసేది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా చిత్ర బృంధానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు రాజమౌళి.

మరింత సమాచారం తెలుసుకోండి: