అరుంధతి సినిమాలో జేజమ్మ గా నటించి కోట్ల మంది తెలుగు ప్రేక్షకాభిమానులను కట్టిపడేసిన నిలువెత్తు రూపం అనుష్క శెట్టి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అనుష్క బాహుబలి చిత్రంలో కూడా దేవసేన గా నటించి తానేమిటో నిరూపించుకున్నారు. ప్రస్తుతం తాను హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నిశ్శబ్దం సినిమాలోని లీడ్ రోల్ లో నటించి... ఆ సినిమా విడుదలకై వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆర్ మాధవన్, బాహుబలి ఫేమ్ సుబ్బరాజు తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పుడు భారతదేశం అంతటా లాక్ డౌన్ అమలవుతుండగా కథానాయకి అనుష్క శెట్టి తన ఇంట్లోనే ఉంటూ తన కుటుంబంతో హ్యాపీగా సమయాన్ని గడుపుతున్నారు. ఐతే ఈరోజు అనుష్క శెట్టి తండ్రి ఎఎన్ విట్టల్ శెట్టి తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. దాంతో అనుష్క శెట్టి ఫేసుబుక్ లో తన తండ్రి గురించి ఒక స్వీట్ పోస్ట్ పెట్టి బర్తడే విషెస్ తెలిపారు.


ఆ పోస్టులో... 'నేను అత్యంత ఆప్యాయత గల, ఉదార స్వభావం గల, బాధ్యతకలిగి బాగా ప్రోత్సహించే తండ్రిని మిమ్మల్నే చూశాను. మీరు మా కోసం ఎన్నో గొప్ప పనులు చేశారు. ఈరోజు మీరు రోజు. మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది. హ్యాపీ బర్త్ డే, మై లవ్లీ పాపా,' అని అనుష్క శెట్టి పేర్కొన్నారు.


ప్రస్తుతం ఈ ఫేసుబుక్ పోస్ట్ కి 80 వేల పైచిలుకు లైకులు రాగా మూడువేల కామెంట్లు వచ్చాయి. నిజం చెప్పాలంటే అనుష్క శెట్టి సామాజిక మాధ్యమాల్లో అంత చురుగ్గా ఉండరు. కానీ తమ కుటుంబం సభ్యుల శుభ దినాలను, శుభకార్యాలను నెట్టింట తన అభిమానులతో పంచుకుంటారు.


గత ఏడాది జులై నెలలో తన తల్లి అయిన ప్రఫుల్లా పుట్టినరోజు సందర్భంగా అనుష్క శెట్టి తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసారు. ఆ ఫోటోలో అనుష్క తల్లిదండ్రులతో పాటు తన ఇద్దరు సోదరులైన గుణరంజన్ శెట్టి, సాయి రమేష్ శెట్టి కూడా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: